Sheikh Hasina: షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..
- షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్కి రప్పించేందుకు చర్యలు..
- అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- రిజర్వేషన్ కోటా హింసలో షేక్ హసీనాపై మర్డర్ కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా ఉద్యమం షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. రిజర్వేషన్ కోటా హింసాత్మకంగా మారడంతో, ఆ దేశ ఆర్మీ అల్టిమేటం ఇవ్వడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, షేక్ హసీనాని తమకు అప్పగించాలని పలువురు బంగ్లా నేతలు భారత్కి అల్టిమేటం విధిస్తున్నారు. స్థాయి మరిచి భారత్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంలోని బీఎన్పీ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ నేతలు హసీనాను అప్పగించాలని కోరుతున్నాయి.
Read Also: MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
రిజర్వేషన్ కోటా అల్లర్లలో జరిగిన మరణాలకు షేక్ హసీనా కారణం అని చెబుతూ ఆమెపై వందలాది కేసులు నమోదయయ్యాయి. వీటిలో ఎక్కువగా హత్య కేసులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సామూహిక హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెని విచారించేందుకు బంగ్లాదేశ్ షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్కి కొత్తగా నిమమితులైన చీఫ్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఆగస్టు 05న ఆమె భారత్ పారిపోయి వచ్చారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఆమెను తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ఎండీ తాజుల్ ఇస్లాం పేర్కొన్నారు.
“సామూహిక హత్యలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి షేక్ హసీనాతో సహా నిందితులందరిపై అరెస్టు వారెంట్లు జారీ చేయడానికి మేము అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో దరఖాస్తు చేస్తాము,” అని విలేకరులు సమావేశంలో అన్నారు. కొత్త కేసుల విచారణకు సంబంధించి ప్రస్తుత అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చట్టానికి సవరణలపై ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాత్కాలిక ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ప్రకారం.. ఈ అల్లర్లలో 1000 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. గత నెలలో హసీనా, మరో తొమ్మిది మందిపై మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది.
- Tags
- Bangladesh
- india
- Sheikh Hasina
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!