Sheikh Hasina: షేక్ హసీనాని ఇండియా నుంచి రప్పించేందుకు బంగ్లాదేశ్ చర్యలు..
- షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్కి రప్పించేందుకు చర్యలు..
- అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- రిజర్వేషన్ కోటా హింసలో షేక్ హసీనాపై మర్డర్ కేసులు..
Sheikh Hasina: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోటా ఉద్యమం షేక్ హసీనా ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. రిజర్వేషన్ కోటా హింసాత్మకంగా మారడంతో, ఆ దేశ ఆర్మీ అల్టిమేటం ఇవ్వడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం నోబెల్ విన్నర్ మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, షేక్ హసీనాని తమకు అప్పగించాలని పలువురు బంగ్లా నేతలు భారత్కి అల్టిమేటం విధిస్తున్నారు. స్థాయి మరిచి భారత్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంలోని బీఎన్పీ పార్టీ, జమాతే ఇస్లామీ పార్టీ నేతలు హసీనాను అప్పగించాలని కోరుతున్నాయి.
Read Also: MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!
Also Read
- RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
రిజర్వేషన్ కోటా అల్లర్లలో జరిగిన మరణాలకు షేక్ హసీనా కారణం అని చెబుతూ ఆమెపై వందలాది కేసులు నమోదయయ్యాయి. వీటిలో ఎక్కువగా హత్య కేసులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సామూహిక హత్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెని విచారించేందుకు బంగ్లాదేశ్ షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్కి కొత్తగా నిమమితులైన చీఫ్ ప్రాసిక్యూటర్ ఆదివారం తెలిపారు. ఆగస్టు 05న ఆమె భారత్ పారిపోయి వచ్చారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద ఆమెను తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చీఫ్ ఎండీ తాజుల్ ఇస్లాం పేర్కొన్నారు.
“సామూహిక హత్యలు మరియు మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించి షేక్ హసీనాతో సహా నిందితులందరిపై అరెస్టు వారెంట్లు జారీ చేయడానికి మేము అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో దరఖాస్తు చేస్తాము,” అని విలేకరులు సమావేశంలో అన్నారు. కొత్త కేసుల విచారణకు సంబంధించి ప్రస్తుత అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చట్టానికి సవరణలపై ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాత్కాలిక ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు నూర్జహాన్ బేగం ప్రకారం.. ఈ అల్లర్లలో 1000 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. గత నెలలో హసీనా, మరో తొమ్మిది మందిపై మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాల ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది.
- Tags
- Bangladesh
- india
- Sheikh Hasina
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!