Zakir Naik: తీవ్రవాద సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రచారకుడు జకీర్ నాయక్కి పాకిస్తాన్ ఘనంగా స్వాగతం పలికింది. ఇండియాకి మోస్ట్ వాంటెడ్గా ఉన్న జకీర్ నాయక్ గత కొన్నేళ్లుగా మలేసియాలో ఆశ్రయం పొందుతున్నాడు. జకీర్ పాకిస్తాన్ వెళ్లిన సందర్భంలో ప్రధాని షెహజాబ్ షరీఫ్తో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇతడి పర్యటన భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదానీ గ్రూప్కు సంబంధించి భారీ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం క్లీన్ ఎనర్జీకి సంబంధించినదిగా చెబుతున్నారు.
ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. అయితే ఈ దాడి కేవలం క్షిపణుల దాడి మాత్రమే కాదు.. బదులుగా, ఈ క్షిపణులు 700-1000 కిలోల వార్హెడ్ పేలోడ్ను కలిగి ఉన్నాయి. ఇది మొత్తం భవనాన్ని నాశనం చేయగలదు. మన యుద్ధాల చరిత్రలో ఇది అపూర్వమని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అన్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ చేరుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇతర సీనియర్ అధికారులతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు.
First Kho Kho World Cup in India: మరో వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ‘ఖో ఖో వరల్డ్ కప్’ వచ్చే ఏడాది భారతదేశంలో జరుగనుంది. 2025లో ఖో ఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ భారత్లో జరుగుతుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఖో ఖో ఫెడరేషన్ సంయుక్తంగా బుధవారం ప్రకటించాయి. 24 దేశాలు, ఆరు ఖండాల నుండి.. 16 పురుష, 16 మహిళా జట్లు ఈ మెగా టోర్నీలో…