టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ బ్యాట్తో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. అభిషేక్ సామర్థ్యంపై జట్టుకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమని, అలాంటి దశను ఇప్పుడు అభిషేక్ ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో అడుగుపెట్టిన అభిషేక్.. వరుసగా మూడు డకౌట్స్ అయ్యాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో…
Tilak Varma Form raise concerns Before T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశను డిపెండింగ్ ఛాంపియన్ భారత్ అజేయంగా ముగించింది. అమెరికా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్లను ఓడించి గ్రూప్-ఎ టాపర్గా నిలిచింది. ఇక సూపర్-8 పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. తొలి సూపర్-8 మ్యాచ్లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొట్టనుంది. ఈ ప్రపంచకప్లో భారత్ తర్వాత అంత ఆధిపత్యం చలాయిస్తోన్న టీమ్ ఏదన్నా ఉందంటే.. అది దక్షిణాఫ్రికానే. ప్రస్తుతం సూర్య…
ICC T20 World Cup 2026: ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియా షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. గ్రూప్ 1లో ఆతిథ్య జట్టు భారత్ జాతీయ క్రికెట్ జట్టు జింబాబ్వే, వెస్టిండీస్ మరియు దక్షిణాఫ్రికా జట్లతో పోటీపడనుంది. ప్రతి మ్యాచ్ సూపర్-8 గ్రూప్ లోని సెమీఫైనల్ స్థానం కోసం కీలకం కానుంది.. టీమిండియా సూపర్-8 షెడ్యూల్ * ఫిబ్రవరి 22న.. భారత్ vs దక్షిణాఫ్రికా మధ్య నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా…
India Super 8 Schedule: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా లీగ్ స్టేజి లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ..అద్భుత ప్రదర్శనతో సూపర్ 8కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో వరుసగా మూడు విజయాలు సాధించిన భారత్ జట్టు సూపర్ ఫేమ్ తో అజేయంగా కొనసాగుతుంది. భారత్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 7న USAపై విజయంతో ప్రారంభించింది. తరువాత ఫిబ్రవరి 12న నమీబియాపై భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి…
Munaf Patel: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. దీంతో గంభీర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2026 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ కు ముందు, భారత జట్టు బుధవారం, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ముందు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లకు 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత విజయంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించారు.…
SA vs IND: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్ 2026 వార్మప్ మ్యాచ్ తో బోణి కొట్టింది. సౌతాఫ్రికాపై టీమిండియా శుభారంభం చేసింది. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగగా, చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు. OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? టాస్ గెలిచి…
భారత్ పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని అనూహ్య సంఘటనలపై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తాజాగా స్పందించారు. టీమిండియా స్టార్స్ జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. మైదానంలో ఏం జరిగినా అది మైదానం వరకే పరిమితం చేయాలని, ఆ మాటలను మర్చిపోకుండా కసితో పోరాడాలన్నారు. అలాగే ప్రోటీస్ హెడ్ కోచ్ షుక్రీ కాన్రాడ్ చేసిన ‘గ్రోవెల్’ వ్యాఖ్య విషయంలో ఆయన మాటలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని బవుమా…
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. స్టేడియం పరిసరాల్లో భారీ పొగమంచు కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.25 వరకు అంపైర్లు పలుమార్లు మైదానాన్ని పరిశీలించారు. పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో చివరికి మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశతో మైదానం వీడారు. మరోవైపు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం…
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సిరీస్లోని మిగిలిన రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా అతడు వైదొలగాల్సి వచ్చిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. మూడో టీ20 మ్యాచ్లోనూ అక్షర్ ఆడని విషయం తెలిసిందే. వైద్య పరీక్షల నిమిత్తం ప్రస్తుతం అక్షర్ లక్నోలో జట్టుతోనే ఉన్నాడు. అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో రాణించడంతో…