Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చిన తర్వాత అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్తో స్నేహాన్ని పెంపొందించుకుంటోంది. అక్కడి తాత్కాలిక ప్రభుత్వంలోని మెజారిటీ వర్గం భారత్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంలో ఉన్న మెజారిటీ వర్గం మతోన్మాద సంస్థలైన జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీలకు చెందిన వారే. 1971 బంగ్లాదేశ్ ఊచకోతని మరిచి పాక్కి దగ్గరవుతోంది.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వరసగా అభియోగాలు మోపుతోంది. ఇప్పటికే ఆగస్టులో చెలరేగిన విద్యార్థుల అల్లర్లలో మానత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, పలువురు మరణాలకు కారణమైందనే నేరం ఆమెపై మోపారు.
India Bangladesh: బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం విర్రవీగుతోంది. భారత్ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న మిగతా నేతలు భారత్పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహ్ఫజ్ ఆలం ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విజయ్ దినోత్సవం రోజున ఆలం ఈ పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా, భారత్లోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్లో విలీనం చేసుకుంటామని బెదిరిస్తూ కామెంట్స్…
Bangladesh: భారత వ్యతిరేకి, ఉగ్రసంస్థ ‘‘ఉల్ఫా’’ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షను బంగ్లాదేశ్ కోర్టు రద్దు చేసింది. 2004 ఛటోగ్రామ్ ఆయుధ రవాణా కేసులో బంగ్లాదేశ్ మాజీ మంత్రి లుత్ఫోజామన్ బాబర్తో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్ర సంస్థ చీఫ్ పరేష్ బారుహ్ మరణశిక్షని జీవితఖైదుకు తగ్గించినట్లు బంగ్లా మీడియా తెలియజేసింది.
Bangladesh: బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటేకి నాయకత్వం వహిస్తున్న హిందూ మతపెద్ద చిన్మోయ్ కృష్ణదాస్ని బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దోశద్రోహ కేసును ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం జైలులు ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి ఆయన బెయిల్ పిటిషన్ని అక్కడి కోర్టులు తిరస్కరించాయి. ఇప్పటికే ఒకసారి ఆయన బెయిల్ పిటిషన్ని బంగ్లాకోర్టులు పట్టించుకోలేదు. చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎండీ సైఫుల్ ఇస్లాం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాస్ తరుపున…
Indian Coast Guard: భారతీయ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న రెండు బంగ్లాదేశ్ ఫిషింగ్ బోట్లను ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ) డిసెంబర్ 09న సీజ్ చేసింది. అక్రమంగా చేపట వేట సాగిస్తున్న 78 మంది మత్స్యకారుల్ని అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ(ఐఎంబీఎల్) వెంబడి సాధారణ పెట్రోలింగ్ సమయంలో ఈ ఆపరేషన్ జరిగింది.
Bangladesh: బంగ్లాదేశ్లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై రాడికల్ ఇస్లామిస్టులు దాడులకు తెగబడుతున్నారు. ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. హిందువుల వ్యాపారాలు, గుడులు, ఇళ్లపై దాడులుకు తెగబడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ పాలన ఈ అరాచకాలను అడ్డుకోలేకపోతోంది. హిందువుల హక్కుల గురించి నినదించిన ప్రముఖ హిందూ నేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. వరసగా హిందువుల్ని టార్గెట్ చేయడంపై…
షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియా వచ్చినప్పటి నుంచి అక్కడి హిందువుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. మహ్మద్ యూనస్ ఎన్ని వాదనలు చేసినా, తెరవెనుక భారత్పై చాకచక్యం ప్రదర్శించడం మానుకోవడం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మాల్దీవుల సాయం తీసుకుని భారత్తో ‘ఆడుతోంది’. బంగ్లాదేశ్ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వస్త్ర ఉత్పత్తి దేశం.
Bangladesh: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆ దేశంలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ గురువారం ఆమెకు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ ఏడాది జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనల్లో షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు, పలువురి చావుకు కారణమైనట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టులో అక్కడి పరిస్థితులు హింసాత్మకంగా మారడంతో హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు.
Bangladesh : బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి సైన్యం ఆధ్వర్యంలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, భారత్తో సంబంధాలలో మార్పు వచ్చింది.