India Bangladesh: ‘‘భారత భూభాగాలను కలుపుకుంటాం’’.. బంగ్లాదేశ్ నేత వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
- భారత భూభాగాలను కలుపుకుంటాం..
- బంగ్లాదేశ్ నాయకుడి వ్యాఖ్యలపై భారత్ ఫైర్..
- షేక్ హసీనాపై కుట్రలో కీలక వ్యక్తిగా ఉన్న మహ్ఫూజ్ ఆలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Bangladesh: బంగ్లాదేశ్లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం విర్రవీగుతోంది. భారత్ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న మిగతా నేతలు భారత్పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహ్ఫజ్ ఆలం ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విజయ్ దినోత్సవం రోజున ఆలం ఈ పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా, భారత్లోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్లో విలీనం చేసుకుంటామని బెదిరిస్తూ కామెంట్స్ చేశాడు.
అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ‘‘మేము బంగ్లాదేశ్ వైపు ఈ సమస్యపై మా తీవ్ర నిరసనను వ్యక్తం చేసాము. సూచించబడిన పోస్ట్ తీసివేయబడినట్లు మేము అర్థం చేసుకున్నాము’’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) ప్రతినిధి రంధి జైస్వాల్ తెలిపారు. పబ్లిక్ కామెంట్స్ చేసే ముందు అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని బంగ్లాదేశ్కి సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది.
Also Read
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
- PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
Read Also: Kerala High Court: ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..
1971 లిబరేషన్ వార్లో పాకిస్తాన్ సైన్యంపై సాధించిన విజయానికి గుర్తుగా బంగ్లాదేశ్ డిసెంబర్ 16న ‘‘విక్టరీడే’’ రోజున ఆలం ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ని కట్టడి చేసే లక్ష్యంతో భారత రాజకీయాలు ఉన్నాయని ఆలం ఆరోపించారు. బంగ్లాదేశ్ నిజమైన స్వాతంత్య్రం, విముక్తి సాధించాలంటే అది ప్రస్తుతం పరిమితుల నుంచి విముక్తి పొందాలని, దాని భూభాగాన్ని విస్తరించాలని, ఇది తమ ప్రయత్నాలకు నాంది మాత్రమే అని ఆలం ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలను బంగ్లాదేశ్లో భాగమని ఆయన అభివర్ణించారు. అయితే ఆ తర్వాత ఆ పోస్ట్ను తొలగించాడు.
ఆగస్టు నెలలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ కుట్రలో ఆలం కీలకంగా వ్యవహరించాడు. సెప్టెంబర్లో న్యూయార్క్లో జరిగి క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఈవెంట్లో బంగ్లాదేశ్ లో షేక్ హసీనాను బహిష్కరించడానికి దారి తీసిన నినసనల వెనక సూత్రధారిగా మహ్ఫూక్ ఆలంను యూనస్ పరిచయం చేశాడు.
#WATCH | Delhi: On the (now deleted) post of Bangladeshi leader Mahfuz Alam, MEA Spokesperson Randhir Jaiswal says, "We have registered our strong protest on this issue with the Bangladesh side. We understand that the post being referred to has reportedly been taken down. We… pic.twitter.com/o5w2QprZq4
— ANI (@ANI) December 20, 2024
తాజావార్తలు
-
Anupama Parameswaran: పీరియడ్స్ విషయంలోనూ అవమానించాడు.. మాజీ ప్రియుడి వేధింపులపై అనుపమ సంచలన వ్యాఖ్యలు
-
Rapo 23 : విలన్ వేటలో రామ్.. ఫైనల్గా బాలీవుడ్ హీరో ఫిక్స్
-
TSLPRB: తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ..
-
గూర్ఖా రెజిమెంట్కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
ట్రెండింగ్
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!