India- Bangladesh: బంగ్లాదేశ్ జల సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ గస్తీ..
- భారత్- బంగ్లాదేశ్ల మధ్య బలహీన పడుతున్న సంబంధాలు..
- బంగ్లాదేశ్ జల సరిహద్దులపై సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం..
- బెంగాల్ జలాల ద్వారా పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తారని ఇంటెలిజెన్స్ సమాచారం..
- 24 గంటలు బంగ్లాదేశ్ జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Bangladesh: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ హిందువులపై కొనసాగుతున్న దాడులతో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సర్కార్ తో భారత్కు దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జల సరిహద్దులపై భారత సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?
Also Read
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
- Mallikarjun Kharge: లోక్సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
అయితే, భారత్లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి. వీటి కోసం ఈస్ట్రన్ కమాండ్ కొత్తగా తేలియాడే సరిహద్దు ఔట్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవి జల సరిహద్దుల్లో గస్తీ నిర్వహణకు తమకు సహకరిస్తాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
Read Also: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
కాగా, 1970కి ముందు పాకిస్థాన్కు చెందిన టెర్రరిస్టులు బెంగాల్ జలాల ద్వారా జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించేవారని.. ప్రస్తుతం అక్కడి సర్కార్ మారడంతో మళ్లీ పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉండొచ్చని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గత పది రోజుల్లో బెంగాల్ సరిహద్దు జలాల ద్వారా దేశంలోకి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించారు. టెర్రరిస్టులు దేశంలోకి చొరబడడానికి నీటి మార్గాలను ఎంచుకోవడంతో జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
-
Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!