India- Bangladesh: బంగ్లాదేశ్ జల సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ గస్తీ..
- భారత్- బంగ్లాదేశ్ల మధ్య బలహీన పడుతున్న సంబంధాలు..
- బంగ్లాదేశ్ జల సరిహద్దులపై సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం..
- బెంగాల్ జలాల ద్వారా పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తారని ఇంటెలిజెన్స్ సమాచారం..
- 24 గంటలు బంగ్లాదేశ్ జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Bangladesh: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ హిందువులపై కొనసాగుతున్న దాడులతో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సర్కార్ తో భారత్కు దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జల సరిహద్దులపై భారత సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
అయితే, భారత్లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి. వీటి కోసం ఈస్ట్రన్ కమాండ్ కొత్తగా తేలియాడే సరిహద్దు ఔట్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవి జల సరిహద్దుల్లో గస్తీ నిర్వహణకు తమకు సహకరిస్తాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
Read Also: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
కాగా, 1970కి ముందు పాకిస్థాన్కు చెందిన టెర్రరిస్టులు బెంగాల్ జలాల ద్వారా జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించేవారని.. ప్రస్తుతం అక్కడి సర్కార్ మారడంతో మళ్లీ పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉండొచ్చని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గత పది రోజుల్లో బెంగాల్ సరిహద్దు జలాల ద్వారా దేశంలోకి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించారు. టెర్రరిస్టులు దేశంలోకి చొరబడడానికి నీటి మార్గాలను ఎంచుకోవడంతో జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?