India- Bangladesh: బంగ్లాదేశ్ జల సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ గస్తీ..
- భారత్- బంగ్లాదేశ్ల మధ్య బలహీన పడుతున్న సంబంధాలు..
- బంగ్లాదేశ్ జల సరిహద్దులపై సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం..
- బెంగాల్ జలాల ద్వారా పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తారని ఇంటెలిజెన్స్ సమాచారం..
- 24 గంటలు బంగ్లాదేశ్ జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India- Bangladesh: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ హిందువులపై కొనసాగుతున్న దాడులతో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సర్కార్ తో భారత్కు దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జల సరిహద్దులపై భారత సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
అయితే, భారత్లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి. వీటి కోసం ఈస్ట్రన్ కమాండ్ కొత్తగా తేలియాడే సరిహద్దు ఔట్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవి జల సరిహద్దుల్లో గస్తీ నిర్వహణకు తమకు సహకరిస్తాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
Read Also: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
కాగా, 1970కి ముందు పాకిస్థాన్కు చెందిన టెర్రరిస్టులు బెంగాల్ జలాల ద్వారా జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించేవారని.. ప్రస్తుతం అక్కడి సర్కార్ మారడంతో మళ్లీ పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉండొచ్చని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గత పది రోజుల్లో బెంగాల్ సరిహద్దు జలాల ద్వారా దేశంలోకి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించారు. టెర్రరిస్టులు దేశంలోకి చొరబడడానికి నీటి మార్గాలను ఎంచుకోవడంతో జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..