India- Bangladesh: బంగ్లాదేశ్ జల సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ గస్తీ..
- భారత్- బంగ్లాదేశ్ల మధ్య బలహీన పడుతున్న సంబంధాలు..
- బంగ్లాదేశ్ జల సరిహద్దులపై సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం..
- బెంగాల్ జలాల ద్వారా పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తారని ఇంటెలిజెన్స్ సమాచారం..
- 24 గంటలు బంగ్లాదేశ్ జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వెల్లడి
India- Bangladesh: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ల మధ్య సంబంధాలు క్రమంగా బలహీన పడుతున్నాయి. ఆ తర్వాత అక్కడ హిందువులపై కొనసాగుతున్న దాడులతో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సర్కార్ తో భారత్కు దూరం పెరుగుతుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జల సరిహద్దులపై భారత సరిహద్దు భద్రతా దళం నిఘా కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Kubera : మరోసారి వాయిదా పడిన శేఖర్ కమ్ముల ‘కుబేర’ ?
Also Read
- Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?
- Raghav chadha: సీఏ నుంచి ఆప్ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?
- Raghav Chadha: ఆప్లో భారీ చీలిక.. పంజాబ్లో 'మాన్' ప్రభుత్వం కూలిపోతుందా!
- Arvind Kejriwal: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
అయితే, భారత్లోని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ 4 వేల కిలో మీటర్ల సరిహద్దును కలిగి ఉంది. గంగ, బ్రహ్మపుత్ర, సుందర్బన్లకు 53 కంటే ఎక్కువ చిన్న నదులు, వాగులు సరిహద్దులుగా కొనసాగుతున్నాయి. ఇక, నీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో.. 24 గంటలూ ఆ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెప్పాయి. వీటి కోసం ఈస్ట్రన్ కమాండ్ కొత్తగా తేలియాడే సరిహద్దు ఔట్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇవి జల సరిహద్దుల్లో గస్తీ నిర్వహణకు తమకు సహకరిస్తాయని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.
Read Also: Jasprit Bumrah: టీమిండియాకు షాక్.. ఆట మధ్యలోనే మైదానం వీడిన బుమ్రా.. కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు
కాగా, 1970కి ముందు పాకిస్థాన్కు చెందిన టెర్రరిస్టులు బెంగాల్ జలాల ద్వారా జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించేవారని.. ప్రస్తుతం అక్కడి సర్కార్ మారడంతో మళ్లీ పాక్ ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉండొచ్చని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గత పది రోజుల్లో బెంగాల్ సరిహద్దు జలాల ద్వారా దేశంలోకి ముగ్గురు ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించారు. టెర్రరిస్టులు దేశంలోకి చొరబడడానికి నీటి మార్గాలను ఎంచుకోవడంతో జల సరిహద్దులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!