Sheikh Hasina: షేక్ హసీనా, కుటుంబపై మరో నేరం.. 5 మిలియన్ డాలర్ల అవినీతిపై విచారణ..
- మరో అవినీతి కేసులో షేక్ హసీనా పేరు..
- అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో 5 బిలియన్ డాలర్ల దుర్వినియోగం..
- హసీనాతో పాటు కుటుంబంపై అభియోగాలు మోపిన యూనస్ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వరసగా అభియోగాలు మోపుతోంది. ఇప్పటికే ఆగస్టులో చెలరేగిన విద్యార్థుల అల్లర్లలో మానత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, పలువురు మరణాలకు కారణమైందనే నేరం ఆమెపై మోపారు. షేక్ హసీనాతో పాటు ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే, తాజాగా షేక్ హసీనా, ఆమె కుటుంబం 5 బిలియన్ డాలర్ల అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు మోపింది. ఈ కేసులో హసీనాతో పాటు మరొకరిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
బంగ్లా రూప్పూర్ అణు విద్యుత్ ప్లాంట్లో 5 బిలియన్ డాలర్లు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ యాంటీ గ్రాఫ్ట్ ప్యానెల్ దర్యాప్తు ప్రారంభించినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బంగ్లాలో రష్యా ప్రభుత్వ సంస్థ రోసాటమ్ నిర్మిస్తున్న రూప్పూర్ అణువిద్యుత్ ప్లాంట్ నిర్మించడంలో భారతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. రాజధాని ఢాకాకు పశ్చిమాన 160 కి.మీ దూరంలో బంగ్లాదేశ్లోనే తొలి అణు విద్యుత్ కేంద్రం నిర్మించబడుతోంది.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
Read Also: America: దత్తపుత్రులపై అత్యాచారానికి పాల్పడిన స్వలింగ సంపర్కుల జంట.. వందేళ్ల జైలు శిక్ష
ఈ కేసులో హసీనాతో పాటు ఆమె కుమారుడు సజీబ్ వాజెడ్ జాయ్, ఆమె మేన కోడులు, యూఎస్ ట్రెజరీ మంత్రి తులిప్ సిద్ధిక్లను యకూడా ప్రశ్నించినట్లు అక్కడి మీడియా ఆదివారం నివేదించింది. రూప్పూూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టులో 5 బిలియన్ డాలర్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూప్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుండి హసీనా, జాయ్, తులిప్ మలేషియా బ్యాంకుకు 5 బిలియన్ డాలర్లు బదిలీ చేయడంపై ఎందుకు చర్యలు తీసుకోలేని అవినీతి నిరోధక కమిషన్(ఏసీసీ)ని హైకోర్టు ఆదేశించిన రెండు రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలను నేషనల్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (ఎన్డిఎం) చైర్మన్ బాబీ హజ్జాజ్ వెలుగులోకి తెచ్చారు.
షేక్ హసీనా ఆగస్టు 05న బంగ్లా నుంచి భారత్కి పారిపోయి వచ్చింది. విద్యార్థుల హింసాత్మక నిరసనల తర్వాత ఆమె భారత్ వచ్చారు. ఆమె సోదరి రెహానా కూడా ఆమె వెంటే ఉన్నారు. ఆమె కొడుకు జాయ్ ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నాడు. ఆమె మేనకోడలు తులిప్ బ్రిటిష్ పార్లమెంట్ సభ్యురాలు.
తాజావార్తలు
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!