Bangladesh: భారత్లో బంగ్లాదేశ్ జడ్జిలకు ట్రైనింగ్.. రద్దు చేసిన యూనస్ సర్కార్..
- భారత్లో బంగ్లాదేశ్ జడ్జిలకు ట్రైనింగ్ క్యాన్సల్..
- భారత వ్యతిరేక విధానాలను ప్రదర్శిస్తున్న యూనస్ సర్కార్..
- బంగ్లాదేశ్లో పెరుగుతున్న భారత వ్యతిరేకత..
- మతోన్మాదులకు అడ్డాగా మారిన పొరుగు దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారతదేశంలో బంగ్లాదేశ్కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఒక రోజు తర్వాత దానిని రద్దు చేసింది. ఈ శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరగాల్సి ఉంది. శిక్షణకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది. అయితే, నోటిఫికేషన్ రద్దు చేశామని బంగ్లా న్యాయమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. రద్దుకు సంబంధించిన వివరణ మాత్రం ఇవ్వలేదు. బంగ్లాదేశ్లోని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేసినట్లు ది డైలీ స్టార్ పత్రిక నివేదించింది.
Read Also: India weapon: ఈ భారత ఆయుధం అంటే చైనా, పాక్కి భయం.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్..
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
బంగ్లాదేశ్లో విద్యార్థుల హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆగస్టు 05న భారత్ వచ్చేసింది. ఆ తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభిస్తోంది. ముఖ్యంగా అక్కడి మైనారిటీలైన హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్న పట్టించుకోవడం లేదు. ఈ దాడులకు పాల్పడుతున్న జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద శక్తులు ఇప్పుడు యూనస్ సర్కారులో కీలకంగా ఉన్నారు.
ఇదే కాకుండా, భారత్ వ్యతిరేకతతో పాటు పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది బంగ్లాదేశ్. 1970 కాలం నాటి పాకిస్తాన్ ఊచకోతను మరిచిపోయి బంగ్లాదేశ్ ఆ దేశానికి దగ్గర కావాలని చూస్తోంది. గత 5 దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా కరాచీ నుంచి ఢాకాకు పాకిస్తాన్ కార్గో నౌకలు వచ్చాయి. ఇదే కాకుండా పాకిస్తాన్ సైన్యం త్వరలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ కూడా ఇవ్వబోతోంది. ఈ పరిణామాలు భారత్కి ఆందోళన కలిగించే విధంగా ఉంది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!