Bangladesh: భారత్లో బంగ్లాదేశ్ జడ్జిలకు ట్రైనింగ్.. రద్దు చేసిన యూనస్ సర్కార్..
- భారత్లో బంగ్లాదేశ్ జడ్జిలకు ట్రైనింగ్ క్యాన్సల్..
- భారత వ్యతిరేక విధానాలను ప్రదర్శిస్తున్న యూనస్ సర్కార్..
- బంగ్లాదేశ్లో పెరుగుతున్న భారత వ్యతిరేకత..
- మతోన్మాదులకు అడ్డాగా మారిన పొరుగు దేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: భారతదేశంలో బంగ్లాదేశ్కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఒక రోజు తర్వాత దానిని రద్దు చేసింది. ఈ శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరగాల్సి ఉంది. శిక్షణకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది. అయితే, నోటిఫికేషన్ రద్దు చేశామని బంగ్లా న్యాయమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. రద్దుకు సంబంధించిన వివరణ మాత్రం ఇవ్వలేదు. బంగ్లాదేశ్లోని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేసినట్లు ది డైలీ స్టార్ పత్రిక నివేదించింది.
Read Also: India weapon: ఈ భారత ఆయుధం అంటే చైనా, పాక్కి భయం.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్..
Also Read
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
బంగ్లాదేశ్లో విద్యార్థుల హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆగస్టు 05న భారత్ వచ్చేసింది. ఆ తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభిస్తోంది. ముఖ్యంగా అక్కడి మైనారిటీలైన హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్న పట్టించుకోవడం లేదు. ఈ దాడులకు పాల్పడుతున్న జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద శక్తులు ఇప్పుడు యూనస్ సర్కారులో కీలకంగా ఉన్నారు.
ఇదే కాకుండా, భారత్ వ్యతిరేకతతో పాటు పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది బంగ్లాదేశ్. 1970 కాలం నాటి పాకిస్తాన్ ఊచకోతను మరిచిపోయి బంగ్లాదేశ్ ఆ దేశానికి దగ్గర కావాలని చూస్తోంది. గత 5 దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా కరాచీ నుంచి ఢాకాకు పాకిస్తాన్ కార్గో నౌకలు వచ్చాయి. ఇదే కాకుండా పాకిస్తాన్ సైన్యం త్వరలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ కూడా ఇవ్వబోతోంది. ఈ పరిణామాలు భారత్కి ఆందోళన కలిగించే విధంగా ఉంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?