బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టుకు భారత జట్టు సారథిగా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తున్నాడు. కుమారుడు పుట్టిన కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మొదటి టెస్టులోనే బౌలర్గానే కాకుండా.. సారథ్యంలోనూ తన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నాడు. కీలక క్యాచ్ వదిలేసినా అసహనం వ్యక్తం చేయని కెప్టెన్ బుమ్రాపై ఆడమ్ గిల్క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. తొలి టెస్టులో విరాట్ కోహ్లీ…
టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఆల్టైమ్ రికార్డు నెలకొల్పాడు. సేనా దేశాలపై (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బుమ్రా 5 వికెట్స్ తీసి ఈ ఘనత అందుకున్నాడు. సేనా దేశాలపై బుమ్రా ఏడు సార్లు ఫైఫర్ పడగొట్టాడు. భారత దిగ్గజం కపిల్ దేవ్ కూడా సేనా దేశాలపై ఏడు సార్లు అయిదు…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024 తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆతిథ్య ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆలౌట్ చేశారు. ఓవర్నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మరో 37 రన్స్ జోడించి ఆలౌట్ అయింది. టెయిలెండర్స్ మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు), హేజిల్వుడ్ (7 నాటౌట్; 31 బంతుల్లో)తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరకు హర్షిత్ రాణా వికెట్ తీయడంతో భారత్ ఊపిరి…
పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మొదటిరోజు ముగిసేసరికి 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి.. 4 కీలక వికెట్స్ పడగొట్టాడు. నాథన్ మెక్స్వీ, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖావాజా సహా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ను అవుట్ చేశాడు. బ్యాటింగ్లో తక్కువ స్కోరుకే పరిమితమై.. డీలా పడ్డ టీమిండియాలో బుమ్రా తన సంచలన…
టీమిండియా తాత్కాలిక కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఫీట్ నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను గోల్డెన్ డకౌట్ చేసిన రెండో బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో స్మిత్ను బుమ్రా మొదటి బంతికే అవుట్ చేశాడు. ఎల్బీ రూపంలో గోల్డెన్ డకౌట్ అయిన స్మిత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే అతడు రివ్యూ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు.…
అందరూ ఊహించిన విధంగానే తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఆడుతున్నాడు. తొలి మ్యాచ్లోనే (41; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వరుసగా వికెట్స్ పడుతున్న సమయంలో క్రీజులోకి వచ్చిన నితీశ్.. రిషబ్ పంత్తో కలిసి జట్టుకు విలువైన రన్స్ అందించాడు. మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం నితీశ్…
తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో బరిలోకి దిగాడు. ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ క్యాప్ అందుకున్న నితీశ్.. అదే ఉత్సహంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ తడబడిన ఆ పిచ్పై 41 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో అతడే టాప్ స్కోరర్. కీలక ఇన్నింగ్స్…
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అరుదైన క్లబ్లో చేరాడు. టెస్ట్ల్లో 3000 పరుగుల మార్కును అందుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ 2024-25 ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. టెస్ట్ల్లో భారత్ తరఫున మూడు వేల పరుగులు పూర్తి చేసిన 26వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 15921 రన్స్ చేశాడు.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం చేశారు. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో స్థానం దక్కింది. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్… పెర్త్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ టెస్టు క్యాప్ను…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. న్యూజీలాండ్పై మాదిరే ఆసీస్పై కూడా భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. యువ బ్యాటర్స్ యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0) డకౌట్ కాగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ (5) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (26: 74 బంతుల్లో 3 ఫోర్లు) ఒక్కడే కాస్త పోరాడాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్…