Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!
- పెర్త్ వేదికగా తొలి టెస్టు
- టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం
- నితీశ్ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం చేశారు. ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో స్థానం దక్కింది. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్… పెర్త్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్లో అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ టెస్టు క్యాప్ను అందుకున్నాడు.
విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ రెడ్డి టెస్టు క్యాప్ను అందుకోవడంతో అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ చేతుల మీదుగా టెస్టు క్యాప్ను అందుకోవడం నితీశ్ లైఫ్లో అత్యుత్తమ క్షణాలని చెప్పారు. ‘టెస్టుల్లో అరంగేట్ర సమయంలో విరాట్ కోహ్లీతో టీమిండియా క్యాప్ అందుకోవాలని నితీశ్ ఎప్పటి నుంచో కలలు కన్నాడు. ఆ కల నేడు నెరవేరింది. నితీశ్ లైఫ్లో అత్యుత్తమ క్షణం ఇదే. ఓ తండ్రిగా నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఈ ఏడాది నితీశ్కు గొప్పగా కలిసొచ్చింది. ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ అదరగొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ టీ20 సిరీస్లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఆడుతున్నాడు. కోహ్లీతో కలిసి నితీశ్ ఆడుతుండడం ఆనందంగా ఉంది’ అని ముత్యాల రెడ్డి చెప్పారు.
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
Also Read: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 14వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
పెర్త్ టెస్టులో నితీశ్ రెడ్డి అదరగొడుతున్నాడు. ఆరు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితీశ్ ఆదుకున్నాడు. రిషబ్ పంత్తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. 47 బంతుల్లో 27 రన్స్ చేశాడు. మరోవైపు పంత్ 37 రన్స్ చేసాడు. భారత్ 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది.
తాజావార్తలు
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!