Pakistan: పాకిస్తాన్ పరిస్థితి అస్సలు బాగా లేదు. అక్కడ ప్రభుత్వం, సైన్యం, న్యాయవ్యవస్థకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా ఆ దేశం బతికీడుస్తోంది. ఇది చాలదన్నట్లు ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం పాక్ ను మరింత కల్లోలానికి గురిచేస్తోంది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత దేశ వ్యాప్తంగా ఆయన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ విడుదలైనా.. కూడా ఆందోళనలు సద్దుమణగడం…
దేశద్రోహ నేరం కింద వచ్చే పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని ఆ దేశ శక్తివంతమైన పాక్ మిలిటరీ ప్లాన్ చేస్తోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోమవారం పేర్కొన్నారు. అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి రూ.5 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో ఈ నెల 9న పారామిలిటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి.
PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర ఆందోళనలు జరిగాయి. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, లాహోర్, పెషావర్ నగరాల్లో ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఆర్మీ కంటోన్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా దాడులు చేశారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టును అక్రమం అని నిన్న పాక్ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’(ఎన్ఏబీ)ని ఆదేశించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను జైలులోనే హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అతడిని చిత్రహింసలకు గురిచేశారని, గుండెపోటు వచ్చేలా ఆహారం, ఇంజెక్షన్ ఇచ్చారని ఇమ్రాన్ తరఫున వాదించే లాయర్లు పేర్కొన్నారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఊరట లభించింది. ఆయన అరెస్ట్ అక్రమం అంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనను అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారం కిందికే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’’(ఎన్ఏబీ) ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది.
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ ఆ దేశంలో విధ్వంసం సృష్టిస్తోంది. పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మక రూపుదాల్చాయి. ఇప్పటికే భద్రతాబలగాల కాల్పుల్లో 8 మంది మరణించారు. మరోవైపు ఖైబర్ ఫక్తుంఖ్వా, బలూచిస్తాన్, పంజాబ్ ప్రావిన్సుల్లో శాంతిభద్రతలను పాకిస్తాన్ సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ఖాన్ అరెస్ట్ నేపథ్యంలో ఆ దేశంలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. పాక్లో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన అల్లర్లు, ఆందోళనలు బుధవారమూ కొనసాగాయి. పలుచోట్ల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఏడుగురు మృతి చెందగా 300 మందికి గాయాలయ్యాయి.