పందెం కట్టాలన్నా, చప్పట్టు కొట్టాలన్నా లేక సవాళ్లు చేయాలన్నా ఇరు పక్షాలు ఉండాలి. ఒకరిని ఒకరు సవాలు చేయగరు. అంతేగాని మనకు మనమే సవాలు విసిరి అవతలి వారు అందుకోలేదు గనక పై చేయి సాధించినట్టు హడావుడి చేస్తే సమాజంలో చెల్లుబాటు కాదు. ఒక వివాదంలో తమ పాత్ర గురించిన ప్రమాణం చేయడం అవతలివారిని చేయమని సవాలు చేయడం అలాటిదే. ఇంతకూ ఏ దేవత మీద దేవుని మీద ప్రమాణం చేసినా చట్టం ముందు చెల్లుబాటు కాదు. ఈ లోగా…
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మరణమృదంగం మోగుతోందా ? కేవలం 24 గంటల వ్యవధిలో 35 మంది ఎందుకు మరణించారు ? గాంధీలో కరోనా పేషంట్ల మరణాల రేటు ఎక్కువగా ఎందుకు ఉంటోంది ? అనేది పరిశీలిస్తే కీలక విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో కరోనా చికిత్సకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద ఆసుపత్రి గాంధీ. ప్రస్తుతం 305 మంది పేషెంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు పదిహేను వందల బెడ్లతో భారీగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిలో…
హైదరాబాద్లో చీటర్కు బుద్ధి చెప్పిందో మహిళ. హైదరాబాద్ గౌతమీనగర్కు చెందిన సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పొరేటర్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఓ వివాహితకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె దగ్గర 10 లక్షలు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇల్లు రాకపోవడంతో ఆమె… నిందితుడిని నిలదీసింది. తన డబ్బులు ఇచ్చేయాలని కోరింది. డబ్బులు ఇవ్వనని.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నాడు. అంతేకాదు మళ్లీ డబ్బులు అడిగితే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో…
నాగార్జున సాగర్లో ఏర్పాటుచేయనున్న సీఎం సభను రద్దు చెయాలని యుగ తులసి ఫౌండేషన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని ప్రభుత్వం జీవో నెంబర్ 69 విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అందుకే ఏప్రిల్ 14 న సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను రద్దు చేయాలని కోర్టును కోరాడు పిటీషనర్ శివకుమార్. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సభను రద్దు చేయాలని కోరారు. ఈనెల…
హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు నిర్వహించాలని బిసిసిఐని కోరామని హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పేర్కొన్నారు. అయితే.. సౌత్ లో రెండు వేదికలు ఉండడంతో హైదరాబాద్ లో మ్యాచ్ లు నిర్వహించడం లేదని కౌన్సిల్ లో నిర్ణయం తీసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. హెచ్సీఏ అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నామని.. ఒక్కసారిగా అభివృద్ధి కావాలంటే మ్యాజిక్ చేయాలా…? అని ఫైర్ అయ్యారు. నిధులు లేకపోతే అభివృద్ధి ఎక్కడ నుంచి కనిపిస్తుంది..? పాత అసోసియేషన్ టాక్స్ లను తాము చెల్లించామన్నారు. తెలంగాణలో…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసు అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 15 చివరి తేదీగా నిర్ణయించారు. దీనికి పదో తరగతి విద్యార్హత. ఏప్రిల్ 9..10 తేదీల్లో ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో ఈ పోస్టులున్నాయి.…