E20 Petrol: E20 పెట్రోల్పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- E20 ఇంధనానికి 52% మంది వ్యతిరేకం.
- E20ను వద్దంటున్న 53% NDA ఓటర్లు.
- మైలేజ్ తగ్గడం, ఇంజిన్ దెబ్బతింటుందనే భయం.
- సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని 76% మంది డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Petrol: కేంద్రంలోని NDA ప్రభుత్వం తీసుకువచ్చని E20 ఇంధనం (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్)పై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా, సీ-ఓటర్ సర్వేలో కేంద్రానికి షాక్ తగిలింది. దేశవ్యాప్తం సర్వేలో సగానికి పైగా ప్రజలు E20 ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపించడం లేదు. జూన్ 8,9 తేదీల్లో 18 ఏళ్లకు పైబడిన 1,641 మందిపై నిర్వహించిన సర్వేలో 52 శాతం మంది E20కి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కేవలం 22 శాతం మాత్రమే మద్దతు తెలిపారు. మరో 25.9 శాతం మంది స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.
సర్వే ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేసిన వారిలో 53 శాతం మంది E20 పెట్రోల్ ఉపయోగించేందుకు ఇష్టపడటం లేదు. దాదాపు 55 శాతం మంది ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల నష్టం కలుగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 52.8 శాతం మంది ఇంజన్ దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 76 శాతం మంది సాధారణ పెట్రోల్తో పాటు E20ని కూడా అందుబాటులో ఉంచి, వినియోగదారులు తమకు నచ్చిన ఎంపికకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో E20 ధర, సాధారణ పెట్రోల్ కన్నా తక్కువగా ఉండాలని చెప్పారు.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
పాత వాహనాలకు E20ని తప్పనిసరి చేయడం సరికాదని 56.3 శాతం మంది చెప్పారు. బీజేపీ ఓటర్లలో 49.2 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 43 శాతం మంది బీజేపీ ఓటర్లు E20 వల్ల భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశ ఇంధన భద్రత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్రం మాత్రం E20 విధానానికి మద్దతు తెలుపుతోంది. దీని వల్ల వాహనాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. మరోవైపు, రైతులకు కూడా మేలు కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఇథనాలు కలపడం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని వెల్లడిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!