E20 Petrol: E20 పెట్రోల్పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
- E20 ఇంధనానికి 52% మంది వ్యతిరేకం.
- E20ను వద్దంటున్న 53% NDA ఓటర్లు.
- మైలేజ్ తగ్గడం, ఇంజిన్ దెబ్బతింటుందనే భయం.
- సాధారణ పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలని 76% మంది డిమాండ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 Petrol: కేంద్రంలోని NDA ప్రభుత్వం తీసుకువచ్చని E20 ఇంధనం (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్)పై ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా, సీ-ఓటర్ సర్వేలో కేంద్రానికి షాక్ తగిలింది. దేశవ్యాప్తం సర్వేలో సగానికి పైగా ప్రజలు E20 ఇంధనాన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపించడం లేదు. జూన్ 8,9 తేదీల్లో 18 ఏళ్లకు పైబడిన 1,641 మందిపై నిర్వహించిన సర్వేలో 52 శాతం మంది E20కి వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కేవలం 22 శాతం మాత్రమే మద్దతు తెలిపారు. మరో 25.9 శాతం మంది స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.
సర్వే ప్రకారం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఓటు వేసిన వారిలో 53 శాతం మంది E20 పెట్రోల్ ఉపయోగించేందుకు ఇష్టపడటం లేదు. దాదాపు 55 శాతం మంది ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల నష్టం కలుగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 52.8 శాతం మంది ఇంజన్ దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో 76 శాతం మంది సాధారణ పెట్రోల్తో పాటు E20ని కూడా అందుబాటులో ఉంచి, వినియోగదారులు తమకు నచ్చిన ఎంపికకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో E20 ధర, సాధారణ పెట్రోల్ కన్నా తక్కువగా ఉండాలని చెప్పారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
పాత వాహనాలకు E20ని తప్పనిసరి చేయడం సరికాదని 56.3 శాతం మంది చెప్పారు. బీజేపీ ఓటర్లలో 49.2 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 43 శాతం మంది బీజేపీ ఓటర్లు E20 వల్ల భారత్ చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, దేశ ఇంధన భద్రత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్రం మాత్రం E20 విధానానికి మద్దతు తెలుపుతోంది. దీని వల్ల వాహనాలకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతోంది. మరోవైపు, రైతులకు కూడా మేలు కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఇథనాలు కలపడం వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని వెల్లడిస్తోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..