త్వరలోనే టాలీవుడ్ సినిమా షూటింగ్స్ సందడి మొదలుకానుంది. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వేవ్ తో ఆగిపోయాయి. అయితే సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కూడా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ జులై 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక బాలీవుడ్ బ్యూటీ…
హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ తనపై వేటు వేయడాన్ని తప్పుబట్టారు హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన ఆయన.. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.. కానీ, హెచ్సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని.. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు… ఎందుకు హెచ్సీఏలో ఉన్నారని ప్రశ్నించారు. ఎవ్వరినీ హెచ్సీఏలోకి రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపింపిచారు.. వాళ్ళ అవినీతిని నేను అడ్డొస్తున్నాను అనే… నాపై కుట్రలు చేస్తున్నారని ఫైర్…
హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఏ రెస్టారెంట్లో చూసుకున్నా బిర్యాని రుచి అద్భుతంగా ఉంటుంది. లాక్డౌన్ సమయంలో కూడా బిర్యానీకే హైదరాబాదీలు మక్కువ చూపారు. ఇక ఇదిలా ఉంటే, మైలార్దేవులపల్లి మెఫిల్ రెస్టారెంట్లో బిర్యానీ బాగాలేదని ప్రశ్నించిన ఇద్దరు యువకులను యాజమాన్యం చితకబాదింది. Read: సుప్రీంకోర్టుకు మార్కుల ప్రణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫలితాలు… దీంతో మైఫిల్ రెస్టారెంట్పై కేసులు నమోదు…
ఈనెల 19 వ తేదీతో రాష్ట్రంలో లాక్డౌన్ సమయం ముగియనున్నది. జూన్ 9 నుంచి పది రోజులపాటు లాక్డౌన్ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే, జూన్ 20 నుంచి లాక్డౌన్ ను పొడిగిస్తారా లేదంటే పూర్తిగా ఎత్తివేస్తారా అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల నుంచి, ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా…
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వస్తుంది. ఈరోజుకు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.45,350 వద్ద ఉండగా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చారు జస్టిస్ ఎన్వీ రమణ.. రాజ్భవన్లో ఆయన బస చేస్తున్నారు.. రోజూ పలువురు ప్రముఖులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిన్న యాదాద్రి వెళ్లి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు ఎన్వీ రమణ దంపతులు.. మరోవైపు, ఇతర ప్రముఖులను కలిసిందేకు ఆయన కొన్ని సార్లు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు.. ఇవాళ ఎస్ఆర్ నగర్ లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు పోలీసులు.. ఇది గుర్తించిన సీజేఐ..…
ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ వైద్య (98) ముంబైలో అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. ఈయన మనవడు శక్తి అరోరా టీవీ సీరియల్ నటుడు. చంద్రశేఖర్ కుమారుడు ప్రొఫెసర్ అశోక్ చంద్రశేఖర్ తన తండ్రి అంత్యక్రియలను ముంబైలోని విలే పార్లే లో మధ్యాహ్నం పూర్తి చేసినట్టు తెలిపారు. చంద్రశేఖర్ 1923 జూలై 7న హైదరాబాద్ లో జన్మించారు. కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, ముంబై చేరారు. వెస్ట్రన్ డాన్స్ లో యూకే నుండి డిప్లోమా పొందారు.…
కరోనా మహమ్మారి సమయంలో అందరినీ భయపెడుతోంది జోకర్ సాఫ్ట్వేర్.. దీనిబారినపడి యువత తీవ్రంగా నష్టపోతున్నారు.. ఇప్పటికే గూగుల్ ఐదుసార్లు జోకస్ సాఫ్ట్వేర్ను డిలీట్ చేసింది.. అయినా.. మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉంది.. యువతను దెబ్బకొడుతూనే ఉంది.. ముఖ్యంగా మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్వేర్ కుదిపేస్తూనే ఉంది.. వివిధ పద్ధతుల్లో మొబైల్ ఫోన్స్, డెస్క్ టాప్లపై ప్రత్యక్షమవుతూనే ఉంది.. ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలోకి సంబంధిత వ్యక్తుల వ్యక్తిగత సమాచారం వెళ్లిపోతోంది.. బ్యాంకు వివరాల నుంచి…
హైదరాబాద్ షాద్ నగర్ లో ఓ నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. నేరుగా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తాడు వార్డ్ బాయ్. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు నకిలీ డాక్టర్ ప్రవీణ్. ఎంబీబీఎస్ పట్టా లేకుండా వైద్యం చేస్తున్నాడు అంటూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దాంతో 420,336 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు షాద్ నగర్ పోలీసులు. వివిధ ఫిర్యాదులతో…