హైదరాబాద్ పాత బస్తీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. చిన్న అంశంపై చెలరేగిన వివాదం ఏకంగా ఇద్దరి వ్యక్తులపై కత్తులతో దాడి చేసే స్థాయికి చేరింది. మహ్మద్ అజర్ అనే వ్యక్తి చాంద్రయాన్ గుట్ట పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గదిని అద్దెకు తీసుకొని ఓగోదామ్ను నిర్వహిస్తున్నారు. గోదామ్కు సామాన్లను చేరవేయడానికి రోజూ ఆటో వస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అదే కాలనీకి చెందిన వాహేద్ అనే వ్యక్తి ఆటో గల్లీలోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.…
Hyderabad Traffic Police Warning: హైదరాబాద్ నగరంలో చలాన్లు పడకుండా కొందరు వాహనదారులు నెంబర్ ప్లేట్ కనబడకుండా చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ తీసేయడం, మాస్కు కట్టడం, ప్రింట్ తుడిచేయడం లాంటివి చేస్తున్నారు. కొందరు నేరస్తులు నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేట్ టాంపరింగ్పై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. వాహనాల నంబర్ ప్లేట్లు టాంపిరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనానికి…
Telangana Congress జుట్టు ఉంటే ఎన్ని కొప్పులైనా పెట్టుకోవచ్చన్నట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. కాకపోతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై ముందుగా మొదలయ్యేది తలనొప్పులే. కాంగ్రెస్ను గ్రేటర్ హైదరాబాద్లో బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా 3 భాగాలుగా విభజించారు. ఈ నిర్ణయాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. నగరంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావాలంటే మూడు ముక్కలు చేయాల్సిందేనని పార్టీ గట్టిగా భావించి అడుగులు…
ఓ లారీ డ్రైవర్ పై కారులో వచ్చిన డుండగులు కాల్పులు జరిపిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కలకలం రేపింది. శనివారం (నిన్న) రాత్రి లారీని వెంబడిస్తూ వచ్చిన ఓ వ్యక్తి తుక్కుగూడ ఎగ్జిట్ 14 వద్ద రాగానే సడెన్ గా లారీడ్రైవర్ పై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అయితే.. గురి తప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తుపాకీ కాల్చడంతో.. లారీ అద్దాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన లారీ డ్రైవర్ మనోజ్…
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. https://www.youtube.com/watch?v=qEgLF95VYOA
రాష్ట్రంలో ఆగస్టులో పోలీసు కొలువులకు పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అధికారులు షోడ్యూల్ ప్రకారం ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రామంలో.. ఆగస్టు 7న జరగాల్సిన కమిసన్ కు సంబధించిన అసిస్టెంట్ కమాండెంట్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నాయి. కాగా.. ముఖ్యంగా యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రెండేళ్లకోసారి విడుదల చేస్తారు. కాగా.. ఎస్ఐ పరీక్షకు ఆప్లై చేసుకున్నవారిలో 20వేలకు పైగా అభ్యర్థులు…