యూత్ ఫర్ యాంటీ కరప్షన్ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం ఎర్రమంజిల్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సలహదారులు శ్రీనివాస్ మాధవ్, సంస్థ పౌండర్ రాజేంద్ర పల్నాటి పాల్గొన్నారు.
Care Hospitals Walkathon: పుట్టుకతో వచ్చే గుండెజబ్బులవల్ల పిల్లల్లో పెరుగుతున్న సంఘటనలు మరియు మరణాల గురించి అవగాహన పెంచే లక్ష్యంతో, కేర్ హాస్పిటల్, బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఇవాళ నెక్లెస్ రోడ్లో వాకథాన్ నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ రాధారాణి.. జెండా ఊపి ఈ వాకథాన్ను ప్రారంబించారు. ఈ వాకథాన్లో 100 మందికిపైగా గుండెలోపాలతో బాధపడుతున్న పిల్లలు, వారితల్లిదండ్రులు, వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది వాకథాన్లో పాల్గొన్నారు. డా.తపన్దాష్, డా.కవిత చింతల్లా, డా.ప్రశాంత్పాటిల సమక్షంలో…
car caught fire: రంగారెడ్డి జిల్లా గండిపేట ఎంజీఐటీ కళాశాల వద్ద నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు మొత్తానికి మంటలు అంటుకున్నాయి.
మహారాష్ట్రలోని పుణెలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ-రేసింగ్ ఇవాళ సాయంత్రం ముగిసింది. నెక్లెస్ రోడ్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ ఫార్ములా ఈ-రేస్ ఛాంపియన్ షిప్లో జీన్ ఎరిక్ విజేతగా నిలిచాడు.
Aza Fashions: ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా పేరుంది అజా ఫ్యాషన్స్కి. మోడ్రన్ లగ్జరీ సర్వీసులలో అత్యుత్తమంగా పేరు తెచ్చుకున్న అజాను డాక్టర్ అల్కా నిషార్ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ ఫ్యాషన్ అథారిటీగా వెలుగుతోంది అజా. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే పలు స్టోర్లున్నాయి అజాకి. తాజాగా హైదరాబాద్లో సరికొత్తగా స్టోర్ని ప్రారంభించింది. భాగ్యనగర వాసులకు సరికొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అజా కృషి చేస్తోంది. వినియోగదారుల సంతృప్తి, వ్యక్తిగతమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ,…
హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. నేడు నగరం MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా శుక్రవారం ఎంఎంటీఎస్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 19 సర్వీసులను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
YS Viveka murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.. దీనికోసం కడప జైల్లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్కు…