House sales: హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈ ఏడాది నివాస గృహాల విక్రయాల్లో 8-10 శాతం వృద్ధి నమోదు అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో దేశంలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు పెరుగుతాయని తెలిపింది. వసూల్లు బాగుండటంతో పాటు రుణభారం తక్కువగా ఉండటంతో డెవలపర్ల క్రిడెట్ ప్రొఫైల్ కూడా బలోపేతం అవుతాయని నివేదిక తెలిపింది.
2023 Ashada Masam Bonalu Starts From Today: జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్లలో ‘బోనాల పండగ’ సందడి మొదలుకాబోతుంది. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల జాతర నేటినుంచి ప్రారంభం కానుంది. ముందుగా గోల్కొండ బోనాలు (Golconda Bonalu 2023) ప్రారంభం కానున్నాయి. లంగర్ హౌస్లో గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపులో తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. వీరు తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు…
Hyderabad Crime: గంటల వ్యవధిలో హైదరాబాద్ లో దారుణ హత్యలు జరిగిపోయాయి. 12 గంటల లోపే ఆరుగురు హత్యకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో.. వివిధ తీరులో హత్యలు జరిగాయి. జరిగిన హత్యలపైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ గా యువకుడిని మార్చే వేసేందుకు ప్రయత్నం చేయగా.. యువకుడు సూసైడ్ చేసుకోవడంతో అతని సోదరులు కలిసి ట్రాన్స్ జెండర్లను హత్య చేశారు. మరొకటి రోడ్డుపై నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులను బండరాళ్లతో కొట్టి చంపేశారు. ప్రేమించడం…
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. ప్రభుత్వాలు మారే కొద్ది కొత్త చట్టాలు వస్తున్నాయి.. అయిన కూడా మహిళలు, యువతులు, చిన్నారులపై రోజురోజుకూ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.. నిన్న బోరబండ లో జరిగిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో దారుణ ఘటన నగరం నడిబొడ్డులో జరిగింది.. హత్యలు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో చోటు…
Hyderabad Crime: హైదరాబాద్ లోని టప్పాచబుత్ర, దైబాంగ్ లో ఇద్దరు హిజ్రాలు దారుణ హత్యకు గురయ్యారు. కత్తి, బండరాళ్లతో మోది ఇద్దరు ట్రాన్స్ జండర్లను హత్య చేశారు దుండగులు. స్థానిక సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Power Bill: మామూలుగా అయితే కరెంట్ ముట్టుకుంటే షాక్ అవుతారు. విద్యుత్ అధికారుల నిర్వాకం వల్ల వినియోగదారులు కరెంట్ ముట్టుకోకుండానే షాక్ కొట్టినంత పనవుతుంది.. కరెంట్ బిల్లులు అలా ఉంటాయి మరి. రెండు గదుల ఇళ్లకు వేలల్లో బిల్లులు పెట్టిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది..ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్లో నిర్మిస్తున్న ఓ నూతన ఫైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణం చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులకు గాయాలవ్వగా.. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో కూలీలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో అందరు ఉలిక్కి పడ్డారు.. ఇక ఘటనా స్థాలానికి ఇంజినీర్ల బృందం…
Gun firing: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్ చౌక్ లో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇరువర్గాల మధ్య సివిల్ వివాదం చెలరేగింది. ఇరువర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మసూద్ అలీ అనే న్యాయవాది లైసెన్స్ డ్ గన్ తో గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.