హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందారు..వేగంగా వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన ఆగివున్న కారును ఢీకొట్టింది.. అయితే ఈ ఘటనలో కారులోనివారు సురక్షితంగా బయటపడ్డా లారీ డ్రైవర్ మాత్రం ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ప్రమాదం జరిగే సమయంలో లారీ డ్రైవర్ కు గుండె పోటు వచ్చిందని సమాచారం.. దాంతో లారీని అదుపుచెయ్యలేక ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది.. వివరాల్లోకి వెళితే..కర్నూల్ నుండి హైదరాబాద్ కు ధాన్యం…
IMD Hyderabad: తెలంగాణాలో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. తెలంగాణ, ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి.
Suspicious Incident: హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిన కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరోవైపు దయాకర్ ప్రియుడితో పాటు అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Dog attacks: తెలంగాణలో వీధికుక్కల స్వైర విహారం ఎక్కువైంది. వీధుల్లో తిరుగుతూ ప్రజలపై దాడులు చేస్తున్నారు. వీధికుక్కల దాడి వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే పిల్లలు వీధికుక్కల దాడులకు గురవుతున్నారు.
Eric Garcetti: భారతదేశానికి కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్ నగరాన్ని ఆస్వాదిస్తున్నారు. తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఎరిక్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా హైదరాబాద్ ఐకానిక్ చార్మినార్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఓల్డ్ సిటీలో ఇరానీ చాయ్ రుచిని ఆస్వాదించారు. హైదరాబాద్ లో ఫేమస్ నిమ్రా కేఫ్ లో ఇరానీ చాయ్ టేస్ట్ చేశారు. ఇరానీ చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్లను టేస్ట్ చేస్తూ.. వెనకాల చార్మినార్…
IT Raids 4th day: ఐటీ సోదాలు నాలుగోరోజు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నగరంలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ సోదాలు నిర్వహించింది.
Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన నిరాధార ఆరోపణలను హైదరాబాద్ మహా నగర్ అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది.
Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు రాజధాని హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా కేజ్రివాల్ బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం కానున్నారు.