Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..
- మరణించే హక్కుపై సుప్రీం కోర్టు కీలక తీర్పు..
- హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. గత 13 ఏళ్లుగా అకస్మారక స్థితిలో ఉన్న 31 ఏళ్ల హరీష్ రాణా ప్రశాంతంగా చనిపోయేందుకు అనుమతిచ్చింది. హరీష్ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ‘‘లైఫ్ సపోర్ట్’’ విత్ డ్రా చేసుకోవడానికి అనుమతినిచ్చింది. రోగి పరిస్థితిపై రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు అధ్యయనం చేసిన తర్వాత ‘‘పాసివ్ యుథనేషియా’’ (నిష్క్రియ కారుణ్యమరణం)పై చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది.
2013లో పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి హరీష్ రాణా పెయింగ్ గెస్ట్ హౌజ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పడి తీవ్రగాయాలపాలయ్యారు. అప్పటి నుంచి అతడికి లైఫ్ సపోర్ట్ అందించారు. అతడి శ్వాస కోసం ట్రాకియోస్టమీ ట్యూబ్, ఆహారం కోసం గ్యాస్ట్రోజెజునోస్టమీ ట్యూబ్తో మంచానికి పరిమితమయ్యారు. అప్పటి నుంచి హరీష్ రాణా తల్లిదండ్రులు కొడుకుకు నిస్వార్థ సేవల్ని అందిస్తున్నారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
Read Also: Gautam Gambhir: డారిల్ మిచెల్కు అర్ష్దీప్ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం తమ ఉత్తర్వుల్లో.. ‘‘దేవుడు ఎవరిని అడిగి ప్రాణం ఇవ్వడు, మనిషి దానిని స్వీకరించాలి’’ అని చెప్పారు. వ్యక్తులు చనిపోవడాన్ని ఎంచుకోవచ్చా అనే విషయంపై షేక్స్పియర్ రాసిన ‘హామ్లెట్’ లోని “జీవించాలా లేక మరణించాలా” (To be or not to be) అనే ప్రసిద్ధ వాక్యాన్ని కూడా ప్రస్తావించారు. లైఫ్ సపోర్ట్ ఉపసంహరణ రెండు కారణాలపై ఆధారపడి ఉండాలని కోర్టు పేర్కొంది. అది వైద్యపరమైన చికిత్సగా పరిగణించబడాలని, రోగి ఉత్తమర ప్రయోజనాల దృష్ట్యా ఉండాలని చెప్పింది. రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు, చికిత్స కొనసాగించాల్సిన బాధ్యత వైద్యుడిపై ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
Read Also: ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!
గత 13 ఏళ్లుగా హరీష్ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదని కోర్టు తెలిపింది. రోగికి చికిత్స చేయడమే వైద్యుడి విధి, రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు ఆ విధిని కోనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. హరీష్ వైద్య చికిత్సను ఉపసంహరించేలా ఎయిమ్స్ రోగికి పాలియేటివ్ కేర్లో ప్రవేశం కల్పించాలని కోర్టు పేర్కొంది. గౌరవం కాపాడుకునేలా తగిన ప్రణాళికతో దానిని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
రాణా కుటుంబం, ఆయన తల్లిదండ్రులు నిస్వార్థ సేవల్ని కోర్టు కొనియాడింది. ‘‘అతని కుటుంబం ఎప్పుడూ అతని వైపు నుండి దూరంగా లేదు… ఒకరిని ప్రేమించడం అంటే చీకటి సమయాల్లో కూడా వారిని చూసుకోవడమే.’’ అని పేర్కొంది. 2011లో అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పులో భారతదేశం అసాధారణ పరిస్థితుల్లో కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేసింది. షాన్బాగ్ అనే నర్సుపై లైంగిక దాడి తర్వాత, 40 ఏళ్ల పాటు కోమాలో ఉంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!