Kidney Racket: కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్..
- కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్
- అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ
- నిజా నిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించిన ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సరూర్నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. దీంతో.. కమిటీ గాంధీ ఆసుపత్రికి రానుంది. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ నాగేందర్ నేతృత్వంలో నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్లతో కలిపి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. అలకనంద హాస్పిటల్ని కమిటీ పరిశీలించింది. హాస్పిటల్స్ సీజ్లో ఉండటంతో కమిటీ సభ్యులు గాంధీ హాస్పిటల్కు వెళ్లారు.
Read Also: TG High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు..
Also Read
మరోవైపు.. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా డీఎం అండ్ హెచ్వో మాట్లాడుతూ.. అలకనంద సూపర్ స్పెషాలిటీ హాస్పటల్కి కేవలం ఆరు నెలల క్రితం 9 బెడ్స్కి అనుమతులు ఇచ్చామని తెలిపారు. కానీ ఈ ఆసుపత్రిలో దారుణంగా, ఇష్టారాజ్యంగా ట్రాన్స్ప్లాంట్ సర్జరీలు చేస్తున్నారని అన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే అలకనంద ఆస్పత్రిని సీజ్ చేసాం.. శాశ్వతంగా ఈ ఆస్పత్రిని మూసి వేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి ఈ అంశం పై చాలా సీరియస్గా ఉన్నారని డీఎం అండ్ హెచ్వో తెలిపారు.
Read Also: Auto Expo 2025: యాక్టివాకు పోటీగా హీరో కొత్త స్కూటర్!.. వారికి బెటర్ ఆప్షన్..
ఎంతటివారైనా వైద్యులపై చర్యలు తప్పవు.. ఇప్పటికే మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు అందజేసామని డీఎం అండ్ హెచ్వో తెలిపారు. డాక్టర్స్ లైసెన్స్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది.. ఆ దిశగా చర్యలు కౌన్సిల్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇద్దరు తమిళనాడు నుంచి ఇద్దరు కర్ణాటక నుంచి రావడంతో భాష సమస్య వచ్చింది.. కిడ్నీ మార్పిడి జరిగిన విషయాన్ని దాచే ప్రయత్నం చేశారు.. ఇప్పటికే ఆస్పత్రిలో ఎక్కడ కూడా కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగినట్టుగా రాతపూర్వకంగా ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారని డీఎం అండ్ హెచ్వో పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇలాంటి సర్జరీలు చేయడంపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసాం.. పూర్తి స్థాయి రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేస్తామని డీఎం అండ్ హెచ్వో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Israeli-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!