హైదరాబాద్ నగరంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టేందుకు ఆటోలతో ప్రమాదకర విన్యాసాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఆటోలతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఈ మేరకు ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని…
హైదరాబాద్లో బైక్, కార్లపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా ఎంతో మంది సతమతమవుతున్నారు. దీంతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు త్వరలో తీపికబురు చెప్పనున్నారు. హైదరాబాద్లో చాలా రోజులుగా ఎంతో మంది వారి వాహనాలపై ఉన్న చలాన్లను చెల్లించకుండా ఉండడంతో భారీగా చలాన్లు అలాగే ఉండిపోయాయి. దీంతో పెండింగ్లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు రాయితీ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే చలాన్లపై ఎంత రాయితీ ఇవ్వలన్నదానిపై పోలీస్ ఉన్నతాధికారులు…
హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో పబ్బు యాజమానులతో ఆయన సమావేశం అయి డ్రగ్స్, మత్తు పదార్థాలను నిరోధించడానికి వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఏడేళ్లుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. హైదరాబాద్ అంటేనే భరోసా అని చెప్పారు. ఒడిశా ఏపీలలో గంజాయి సాగు ఎక్కువగా చేస్తున్నారు. అక్కడి నుండి గంజాయి కొని…
శంషాబాద్ లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం అయింది. మై హోం సహకారంతో పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి, హోం మంత్రి మహమూద్ అలీ, మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు. ఏడాది కాలంలోనే ఈ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తిచేశారు. అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ రూపుదిద్దుకుంది. , ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పి మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి,…
హైదరాబాద్లో చైన్ స్నాచర్లు వీరంగం సృష్టించారు. గంట వ్యవధిలోనే వేర్వేరు చోట్ల నాలుగు చోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని మారేడ్పల్లిలో ఒక మహిళ మెడలో నుంచి మూడున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకొని పారిపోయారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు అప్రమత్తమయ్యేలోపే పేట్ బషీరాబాద్ పరిధిలో మరో దొంగ మూడు చైనింగ్ స్నాచింగ్లకు పాల్పడగా ఒకటి విఫలమైంది. ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. Read Also: పీజీ వైద్య కాలేజీల్లో ఫీజుల…
నార్కోటిక్ డ్రగ్స్ పై తెలంగాణా నార్త్, వెస్ట్ జోన్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కూడా డ్రగ్స్ ముఠాలు పై కన్నేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్కు డ్రగ్స్ తెచ్చిన మూడు ముఠాలను అరెస్టు చేశారు. మూడు ముఠాల్లో 7 మంది నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన ముఠా నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఇబ్రాన్బాబు షేక్, నూర్ మహ్మద్…
హైదరాబాద్ డ్రగ్స్ కేంద్రo గా మారుతుందా.. హైదరాబాదులో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ విరివిగా దొరుకుతున్నాయి. సంపన్నుల పిల్లలు చాలా వరకు డ్రగ్స్ కు అలవాటు పడ్డారా. కాలేజీలో డ్రగ్స్ ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిందా. సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సినిమా స్టార్స్ లో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారా.. వీటన్నిటికీ హైదరాబాద్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాదులో పెద్ద మొత్తంలో అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై మాఫియా హైదరాబాద్ లో తిష్ట వేసి…
కల్తీరాయుళ్లు దేన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల్లో చాలా వరకు కల్తీ చేస్తున్న కేటుగాళ్లను అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేసి పట్టుకుంటున్నా కల్తీ రాయుళ్లు మాత్రం తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రభుత్వం దీనిపై ఎన్ని ఆంక్షలు విధించిన కల్తీ రాయుళ్లు తమ పనిని ఏదేచ్చగా కొనసాగిస్తునే ఉన్నారు. చివరకు ప్రభుత్వం అమ్మే విజయ నెయ్యిని సైతం కల్తీ చేయడానికి ప్రయత్నించారు కల్తీకేటుగాళ్లు. Read Also: ధర్మయుద్ధంలో బీజేపీ గెలిచింది: లక్ష్మణ్ ఈ ఘటన హైదరాబాద్…
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మౌనంగా ర్యాలీ తీస్తామని బీజేపీ శ్రేణులు ప్రకటించాయి. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి రాణిగంజ్ వరకు ర్యాలీ చేపడతామని బీజేపీ తెలిపింది. దీంతో సికింద్రాబాద్ లో భారీగా పోలీసులు మోహరించారు.