తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది. పబ్ లలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఖరీదైన డ్రగ్స్ నగరంలో ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్నాయి. బంజారా హిల్స్ రాడిసన్ హోటల్ లోని ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ దొరికిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ ని అరికట్టేందుకు పటిష్టమయిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరే డ్రగ్ టెస్ట్లు చేయాలని నిర్ణయించింది.…
తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో శ్రీరామనవమి వేడుకల్లో శోభకనిపిస్తోంది. వాడవాడలా శ్రీరాముడి కల్యాణం ఘనంగ నిర్వహించారు. శ్రీరామనవమి పేరు చెప్పగానే శోభాయాత్ర గుర్తుకువస్తుంది. సీతారాం బాగ్ నుండి మొదలైంది శోభాయాత్ర. ఆరున్నర కిలో మీటర్లు కొనసాగనుంది శోభాయాత్ర. టాస్క్ ఫోర్స్ , లా అండ్ ఆర్డర్ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తరువాత హైదరాబాద్ లో నవమి శోభాయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీతారాంబాగ్…
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోందా? డ్రగ్స్ తీసుకున్నవారికి నోటీసులు జారీ కానున్నాయా? అంటే అవునంటున్నారు పోలీసులు. పుడింగ్ అండ్ మింక్ పబ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. బంజారా హిల్స్ లోని పబ్ లో పట్టుబడిన వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఆధారాలు లభించాయి. 20 మందికి డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా లభ్యమైన ఆధారాలతో దర్యాప్తులో ముందడుగు పడిందంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న 20 మందికి నోటీసులు ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న…
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. ఈ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్ ని పోలీసులు గుర్తించారు. శనివారం రైడ్స్ లో ఓ అనుమానితుడిని గుర్తించిన పోలీసులు. అతడు గోవా కు రెగ్యులర్ గా వెళ్తుంటాడని నిర్దారణకు వచ్చారు. పబ్ కు వచ్చిన వ్యక్తుల్లో ముగ్గురి పై డ్రగ్స్ కేసులు వున్నాయి.…
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదంటోంది కుషిత. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలిం నటి కుషిత మీడియాను కోరింది. హైదరాబాద్ నగరంలో లేట్ అవర్స్ పబ్ లో ఉండడం మా తప్పు కాదన్నారు జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిలింనటి కుషిత. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అన్న విషయం మాకు తెలియదు. తెలిస్తే మేము అక్కడికి ఎందుకు వెళ్తాము…? అక్కడ రష్ ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. డ్రగ్స్ అక్కడ వినియోగిస్తున్నారని మాకు…
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన రాడిసన్ హోటల్ లో పోలీసుల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఫుడింగ్ మింక్ పబ్ కేసుపై అటు పోలీసులు, ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. పబ్ కేసు లో పోలీసు బృందాల దర్యాప్తు కొనసాగుతోంది. నాలుగు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో పబ్ నిర్వాహకులు అనిల్, అభిషేక్ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు. ఈ కేసులో పరారీలో…
హైదరాబాద్ రహదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో ఘోర ప్రమాదాల తర్వాత ఇష్టమొచ్చినట్టుగా స్టిక్కర్లు వేసుకుని తిరిగేవారిపై చర్యలు చేపట్టారు. వీఐపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రెస్, అడ్వకేట్ల పేరుతో స్టిక్కర్లు అంటించినవారు తప్పనసరిగా సరైన గుర్తింపు కార్డులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు పోలీసులు. లేదంటే సంబంధిత వెహికల్ ని సీజ్ చేస్తామన్నారు. కారులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఈ కారు యజమాని ఆర్సీ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్సులు, బ్లాక్ స్టిక్కరింగ్ నిరోధానికి చర్యలు చేపట్టారు. కారు…
సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. హోం గార్డ్ స్థాయి నుండి డీసీపీ వరకు మహిళా పోలీస్ అధికారిణి లు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమయినది. అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది… యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల సినిమాలలో కూడా మహిళల…
హైదరాబాద్ నగరంలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అయితే కొంతమంది ఆకతాయిలు రోడ్డుపై వెళ్లేవారిని భయపెట్టేందుకు ఆటోలతో ప్రమాదకర విన్యాసాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు ఆటోలతో ప్రమాదకర రీతిలో స్టంట్లు చేశారు. ఈ తతంగాన్ని కొంతమంది స్థానికులు వీడియో తీశారు. ఈ మేరకు ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించారు. ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని…
హైదరాబాద్లో బైక్, కార్లపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించకుండా ఎంతో మంది సతమతమవుతున్నారు. దీంతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు త్వరలో తీపికబురు చెప్పనున్నారు. హైదరాబాద్లో చాలా రోజులుగా ఎంతో మంది వారి వాహనాలపై ఉన్న చలాన్లను చెల్లించకుండా ఉండడంతో భారీగా చలాన్లు అలాగే ఉండిపోయాయి. దీంతో పెండింగ్లో ఉన్న చలాన్లు చెల్లించేందుకు రాయితీ ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే చలాన్లపై ఎంత రాయితీ ఇవ్వలన్నదానిపై పోలీస్ ఉన్నతాధికారులు…