హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది హెల్మెట్లు వున్నా పెట్టుకోకుండా ప్రయాణాలు చేస్తుంటారు. తాజాగా కోవిడ్ మహమ్మారి వేళ హెల్మెట్ పెట్టుకోకుండా, ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఘనుల ఫోటోలను షేర్ చేస్తున్నారు. హెల్మెట్ లేకపోవడమే కాకుండా మాస్కులు లేకుండా యథేచ్ఛగా నగర రోడ్లపై తిరిగేస్తున్నారు. వైద్య శాఖ అధికారులు ఒకవైపు ఒమిక్రాన్…
హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల పెద్దమొత్తంలో పలువురి మొబైళ్లు అపహరణకు గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బాధితులు తమ మొబైల్ ఫోన్లు మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదులను హాక్ ఐ యాప్ను ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల ఆచూకీని కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీతో మొబైల్ కేటుగాళ్లకు పోలీసులు చెక్ చెప్తున్నారు. Read Also: గుడ్న్యూస్.. త్వరలో భారత్ నుంచి మరో…
ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్న మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాగడం రోడ్డు ఎక్కడం ప్రమాదాలను కొని తెచ్చుకోవడం వారికి పరిపాటిగా మారింది. దీని ఫలితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నగరంలో మితిమీరి పోతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు. నిన్న ఒక్కరోజే డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి.…
హైదరాబాద్లో యువత స్పీడ్కి బ్రేకులే లేవు. కాస్త ఖాళీ దొరికిందంటే చాలు వివిధ రకాల బైక్లతో రోడ్లమీదకు వచ్చేస్తారు యువత. తాజాగా హైదరాబాద్లో యువత బైక్ లపై విన్యాసాలు చేస్తూ హల్ చల్ చేశారు. హైదరాబాద్లో పట్టపగలే పోకిరీల విన్యాసాలు కలకలం రేపాయి. రద్దీ ఉన్న ఏరియాలో బైక్ విన్యాసాలు చేస్తున్నారు పోకిరీలు. సెలవు దినం కావడంతో ఆదివారం హైదరాబాద్ రోడ్లపై విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు కుర్రకారు. మలక్ పేట ప్రాంతంలో బైక్ విన్యాసాలు…
దేశంలో దొంగ బాబాల గురించి నిత్యం వార్తలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు బాబాల మీద నమ్మకంతో వారిని ఆశ్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ దొంగబాబు రాసలీలలు బయటపడ్డాయి. ఆ నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు చాంద్రాయన్ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగ బాబా, అతడి కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై ఓ బాబా అత్యాచారానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళ్తే… అనారోగ్యానికి గురైన తల్లిని కాపాడుకునేందుకు…
చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనుమానం ఉన్న ప్రతీ వాహనాన్ని ఆపి చెక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నాంపల్లిలో ట్రాఫిక్ పోలీసులు హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 వాహనాన్ని ఆపి చెక్ చేయగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. హోండా యాక్టివాపై 117 చలాన్లు పెండింగ్లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ రూ.3 లక్షలకు పైగా ఉన్నది. Read: హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్…
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేస్తున్నారు. హీరో నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాటరాయుళ్లను పట్టుకున్నారు.25 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులను చూసి బడాబాబులు పారిపోయారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగ్ మండలం మంచిరేవుల గ్రామంలో పేకాట ఆడుతున్నారు. ప్రముఖ యువహీరో నాగ శౌర్య ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్నారు. ఏకకాలంలో ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించడంతో 25 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖులు కలిసి పేకాట ఆడారు.…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో భారీగా మెపిడ్రెన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రూ. రెండు కోట్ల విలువగల డ్రగ్ స్వాధీనం చేసుకోవడంతో నగరం ఉలిక్కిపడింది. 4.92 కేజిలతో పాటు, ఓ కార్ సీజ్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులు పవన్,మహేష్ రెడ్డి,రామకృష్ణగౌడ్ ను అరెస్ట్ చేశారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రధాన నిందితులు ఎస్క్ రెడ్డి, హన్మంత్ రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు…
గంజాయి రవాణా జోరుగా సాగుతూనే ఉంది.. దీంతో.. గంజ విక్రయదారులపై సీరియస్గా ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు.. ‘ఆపరేషన్ గంజా’ పేరుతో నగరంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.. ఇప్పటి వరకు 23 మంది గంజాయి విక్రయదారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.. ఒకేసారి 23 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక, గంజా ఫ్రీ హైదరాబాద్ గా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా.. ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్న…
హైదరాబాద్ నగరంలో మొన్నటి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బయటకు అడుగు పెడితే చాలు ఎప్పుడు వర్షం కొడుతుందనని అందరూ భయపడుతున్నారు. ఇక శనివారం సాయంత్రం కూడా భాగ్య నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మలక్ పేట, అంబర్పేట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఇలా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. దీంతో వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కిలో మీటర్ల పొగవున ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ముఖ్యంగా వర్షం కారణంగా మలక్ పేట…