Pudding and Mink Pub: తవ్వేకొద్దీ బయటపడుతున్న డ్రగ్స్ దందా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. ఈ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్ ని పోలీసులు గుర్తించారు. శనివారం రైడ్స్ లో ఓ అనుమానితుడిని గుర్తించిన పోలీసులు. అతడు గోవా కు రెగ్యులర్ గా వెళ్తుంటాడని నిర్దారణకు వచ్చారు. పబ్ కు వచ్చిన వ్యక్తుల్లో ముగ్గురి పై డ్రగ్స్ కేసులు వున్నాయి. ఇప్పటికే మేనేజర్ అనిల్, ఓనర్ అభిషేక్ రిమాండ్ లో వున్నారు.
పరారీలో మరో ఇద్దరు ఓనర్లు అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. పబ్ లోకి డ్రగ్స్ ఎవరు తెచ్చారనే దానిపై ముమ్మర విచారణ సాగుతోంది. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కేసులో పోలీసులపై వరుస ఆరోపణలు, విమర్శలు రావడంతో కేసును సవాల్ గా తీసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసును చేధించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్ లో 125 మంది యువతీ యువకులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. వారంతా దర్యాప్తు పూర్తయ్యేవరకూ అందుబాటులో వుండాలని ఆదేశించారు. గతంలో కూడా పుడింగ్ అండ్ మింక్ పబ్ లో డ్రగ్స్ దందా నడిచినట్లు గుర్తించారు పోలీసులు. 125 మందిలో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? పబ్ కు వచ్చే వారు డ్రగ్స్ కు అలవాటు పడ్డారా? పబ్ లో డ్రగ్స్ ఎవరి కోసం తెచ్చారా? 125 మందిలో పబ్ కు రెగ్యులర్ గా వచ్చే యువతి యువకుల లిస్ట్ తయారు చేసే పనిలో పడ్డారు పోలీసులు.
డ్రగ్స్ కేసు కొలికి వచ్చే వరకు 125 మంది పోలీసులకు అందుబాటులో ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. 125 మందిలో చాలా మంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు, వారి కోసం అన్వేషిస్తున్నారు.
https://ntvtelugu.com/bandi-sanjay-fires-on-drugs-mafia/
125 మందిలో పోలీసులకు అందుబాటులో లేని కొందరు యువతి యువకుల్ని ఎలా పట్టుకోవాలనే దానిపై ఆలోచిస్తున్నారు. పోలీసులు దాడి చేసి సమయంలో 96 మంది యువకులు ..36 మంది యువతులు ఉన్నారు. పోలీసులు పట్టుకున్న వారిలో చాలామంది ఫోన్లు స్విచాఫ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. పబ్ లో పనిచేస్తున్న 20 మంది స్టాఫ్ పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు పోలీసులు. 20 మందికి సంబంధించిన కాల్ డేటా రికార్డ్ తోపాటు వాట్సాప్ చాటింగ్ పరిశీలిస్తున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!