హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద నిర్మించిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవరు మంత్రి కేటీఆర్ నేడు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. రూ.45.90 కోట్లతో 674 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించగా.. ఈ ఫ్లెఓవర్ ద్వారా చాంద్రాయణగుట్టలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. SRDP ఫలాలు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా లక్ష్యం నెరవేరే అవకాశం దగ్గరలోనే ఉంది. ఈచాంద్రాయణగుట్ట…
స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకుంటామని ఇప్పటికే మా కార్యకర్తలు ఆన్లైన్ లో టికెట్ లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచళన వ్యాఖ్యలు చేసారు. షో లోపలే మునావర్ ఫరూకీ పై దాడి చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే, డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజాసింగ్ తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులు వద్దన్నా.. నేను షోను అడ్డుకుని తీరుతా అంటూ మండిపడ్డారు. ధర్మం కన్నా.. నాకు పార్టీ…
Hyderabad Public School: హైదరాబాద్లోని రామంతాపూర్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్ఆర్)కి 50 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో రేపు శనివారం (జూలై 30న) ఉదయం పదిన్నర గంటలకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది.
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ఘటన మరిచిపోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న (శుక్రవారం) ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు భారీగా నీరు చేరడంతో.. గేట్లు తెరిచి మూసీలోకి నీటిని…
సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (86) 4వ తేదీ రాత్రి రెండు గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన భార్య శ్రీమతి లక్ష్మి గత యేడాది నవంబర్ లో మరణించారు. వారికి ఓ అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. భార్య మరణానంతరం ఇంటికే పరిమితమైన శ్రీహరి గతవారం ఇంటిలో పడిపోవడంతో తుంటి ఎముక విరిగింది. వెంటనే నిమ్స్ లో విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. అయితే ఇతర అనారోగ్య సమస్యతో సోమవారం రాత్రి ఆయన కన్నుమూశారు. కుమారుడు శ్రీరామ్…
సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. సభ్య సమాజం తలదించుకునేలా చాలా మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒకరు తప్పు చేస్తే…
పలు జిల్లాలో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా.. బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. తూర్పు, మధ్య బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నది.…
సంచలనం రేపిన సరూర్నగర్ పరువు హత్య కేసులో ఇద్దరు నిందితుల ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. పోలీసులు భావించినట్లుగానే నిందితులను కస్టడీకి తీసుకోవడంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన చెల్లెలు అశ్రిన్ మతాంతర వివాహం చేసుకుందన్న పగతో మరో బంధువుతో కలసి.. చెల్లెలు భర్త నాగరాజును నడి రోడ్డుపై అన్న దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులైన సయ్యద్ మొబిన్, మసూద్ అహ్మద్ పథకం ప్రకారమే నాగరాజును హత్య…
సినీనటి కరాటే కళ్యాణి(karate kalyani) దత్తపుత్రిక వివాదంపై అధికారులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని కళ్యాణి నివాసంలో ఆమె తల్లి విజయలక్ష్మి, సోదరుడిని చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ స్కీం అధికారులు ప్రశ్నించారు. కరాటే కళ్యాణి అక్రమంగా ఓ పాపను దత్తత తీసుకున్నారంటూ 1098 నంబర్ కు ఫిర్యాదు వచ్చిందని.. అందుకే పోలీసుల సహకారంతో వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు విచారణ జరుగుతున్న సమయంలో కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె తల్లి, తమ్ముడిని ప్రశ్నించామన్నారు. నగరంలోనే ఓ…