Hyderabad : టీబీపై యుద్ధం.. రోగుల సమాచారం ఇస్తే ఖరీదైన బహుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad : క్షయ వ్యాధిపై హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యుద్ధం ప్రకటించింది. ఎక్కడైనా క్షయ వ్యాధిగ్రస్తులు కనిపిస్తే సమాచారం అందించాలని నగరవాసులకు పిలుపు నిచ్చింది. అంతే కాకుండా సమాచారం అందించినవారికి బహుమతి అందిస్తామని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. క్షయ వ్యాధి(టీబీ)ని రూపుమాపేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే దాదాపు పూర్తి స్థాయి నియంత్రణలో ఉన్న టీబీ రోగాన్ని పూర్తిగా రూపుమాపాలని కంకణం కట్టుకుంది. ఈ చర్యల్లో భాగంగా కొత్తగా ఎక్కడ రోగి కన్పించినా సంబంధిత వ్యక్తుల పూర్తి సమాచారం అందించాలని కోరింది. తద్వారా రోగి వివరాలు సేకరించి వారికి చికిత్స అందించాలని నిర్ణయించింది.
Read Also: Father Kills Son: దారుణం.. ఆస్తి కోసం కొడుకు చంపిన కన్న తండ్రి
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
కొత్తగా క్షయ వ్యాధి నిర్ధారణ అయిన రోగి సమాచారం అందించిన ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంలకు రోగికి రూ.500 చొప్పున బహుమతి అందిస్తామని అధికారులు ప్రకటించారు. బుధవారం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రి సెమినార్ హాలులో ప్రభుత్వ వైద్య అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల మెడికల్ డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో హైదరాబాద్ వైద్యశాఖాధికారి డాక్టర్ వెంకటి ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం క్షయ వ్యాధి నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. మిజిల్స్, రుబెల్లా వ్యాధులపై ప్రైవేటు ఆసుపత్రులు అప్రమత్తం కావాలన్నారు. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు, జ్వరంతో ఎవరైనా రోగులు ఆసుపత్రిలో చేరితే ఆ సమాచారం వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు అందించాలని సూచించారు. అలాగే నగరంలోని ల్యాబ్లు, స్కానింగ్ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ కొరఢా ఝళిపించనుంది. కొన్ని స్కానింగ్ కేంద్రాలు, నర్సింగ్హోంలు గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయని, ఇలాంటి స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తప్పవని డాక్టర్ వెంకటి హెచ్చరించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!