Warangal New Bus Station: రూ.75 కోట్లతో 2.32 ఎకరాలు..గ్రేటర్లో స్మార్ట్ బస్స్టేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal New Bus Station: గ్రేటర్ వరంగల్లో పాత బస్ స్టేషన్ స్థానంలో కొత్త బస్ స్టేషన్ రానుంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనులను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకుంటోంది. 2.32 ఎకరాల్లో రూ.75 కోట్ల అంచనా వ్యయంతో 32 ప్లాట్ఫారమ్లతో ఐదు అంతస్తుల భవనం రానుంది. ఈ భవనంలో కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర వసతులు ఉంటాయి. వరంగల్ రైల్వేస్టేషన్, కొత్తగా నిర్మించనున్న నియో మెట్రో రైలుకు దీన్ని అనుసంధానం చేస్తారు. వరంగల్ బస్ స్టేషన్ ఆవరణ.. దాని చుట్టు పక్కల స్థలాలను కలిపి విశాలంగా కొత్త బస్టాండ్ ఉంటుంది. వరంగల్ బస్ స్టేషన్ పక్క నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా కాశీబుగ్గ ప్రధాన రహదారికి కలిపేలా రోడ్డు నిర్మాణంపై చర్చలు నడుస్తున్నాయి. రెండున్నర ఎకరాల్లో కొత్త బస్టాప్ రానుంది. ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తారు. 32 బస్ ప్లాట్ ఫారంలను నిర్మించనున్నారు. టీఎస్ఆర్టిసీ , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అధికారులతో స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. 2050 లో కూడా నగరం రవాణా అవసరాలను తీర్చేందుకుడా DPR సిద్ధం చేశారు.

Also Read
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
అయితే.. దశలవారీగా ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్ సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ ఒక సంవత్సరం వ్యవధిలో నిర్మించబడుతుంది. (KUDA) తన స్వంత డబ్బును ఖర్చు చేసి TSRTC కోసం గ్రౌండ్ ఫ్లోర్ను అప్పగిస్తుంది. ఇతర అంతస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వనున్నారు. ప్రారంభ ప్రతిపాదన ప్రకారం ఆదాయాన్ని KUDA – TSRTC పంచుకుంటుంది. కొత్త బస్ స్టేషన్ డిజైన్ ఇప్పటికే సిద్ధమైంది. డిజైన్ ప్రకారం కొత్త బస్ స్టేషన్, ప్రతిపాదిత ‘నియో’ మెట్రో రైల్వే స్టేషన్ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఇదిలావుండగా, ‘O’ నగరంలోని తాత్కాలిక బస్ స్టేషన్ నుండి లేదా వార్నగల్-నర్సంపేట రహదారిలోని మరొక ప్రదేశం నుండి బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామని కుడా అధికారి ఒకరు తెలిపారు.
Tollywood: హీరో, హీరోయిన్గా నరేష్-పవిత్ర లోకేష్.. సినిమా కథ అదేనా?
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!