Warangal New Bus Station: రూ.75 కోట్లతో 2.32 ఎకరాలు..గ్రేటర్లో స్మార్ట్ బస్స్టేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal New Bus Station: గ్రేటర్ వరంగల్లో పాత బస్ స్టేషన్ స్థానంలో కొత్త బస్ స్టేషన్ రానుంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనులను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకుంటోంది. 2.32 ఎకరాల్లో రూ.75 కోట్ల అంచనా వ్యయంతో 32 ప్లాట్ఫారమ్లతో ఐదు అంతస్తుల భవనం రానుంది. ఈ భవనంలో కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర వసతులు ఉంటాయి. వరంగల్ రైల్వేస్టేషన్, కొత్తగా నిర్మించనున్న నియో మెట్రో రైలుకు దీన్ని అనుసంధానం చేస్తారు. వరంగల్ బస్ స్టేషన్ ఆవరణ.. దాని చుట్టు పక్కల స్థలాలను కలిపి విశాలంగా కొత్త బస్టాండ్ ఉంటుంది. వరంగల్ బస్ స్టేషన్ పక్క నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా కాశీబుగ్గ ప్రధాన రహదారికి కలిపేలా రోడ్డు నిర్మాణంపై చర్చలు నడుస్తున్నాయి. రెండున్నర ఎకరాల్లో కొత్త బస్టాప్ రానుంది. ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తారు. 32 బస్ ప్లాట్ ఫారంలను నిర్మించనున్నారు. టీఎస్ఆర్టిసీ , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అధికారులతో స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. 2050 లో కూడా నగరం రవాణా అవసరాలను తీర్చేందుకుడా DPR సిద్ధం చేశారు.

Also Read
- CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
- CM Revanth Reddy : నెట్ జీరో సిటీగా 'భారత్ ఫ్యూచర్ సిటీ'.. ఇన్వెస్టర్ల కోసం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సెల్.!
- Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
అయితే.. దశలవారీగా ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది. ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్ సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ ఒక సంవత్సరం వ్యవధిలో నిర్మించబడుతుంది. (KUDA) తన స్వంత డబ్బును ఖర్చు చేసి TSRTC కోసం గ్రౌండ్ ఫ్లోర్ను అప్పగిస్తుంది. ఇతర అంతస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వనున్నారు. ప్రారంభ ప్రతిపాదన ప్రకారం ఆదాయాన్ని KUDA – TSRTC పంచుకుంటుంది. కొత్త బస్ స్టేషన్ డిజైన్ ఇప్పటికే సిద్ధమైంది. డిజైన్ ప్రకారం కొత్త బస్ స్టేషన్, ప్రతిపాదిత ‘నియో’ మెట్రో రైల్వే స్టేషన్ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఇదిలావుండగా, ‘O’ నగరంలోని తాత్కాలిక బస్ స్టేషన్ నుండి లేదా వార్నగల్-నర్సంపేట రహదారిలోని మరొక ప్రదేశం నుండి బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామని కుడా అధికారి ఒకరు తెలిపారు.
Tollywood: హీరో, హీరోయిన్గా నరేష్-పవిత్ర లోకేష్.. సినిమా కథ అదేనా?
తాజావార్తలు
-
Mega 158: డాడీ కోసం పెద్ది!
-
PM Modi: కాశీ-రోమ్ శాశ్వతనగరాలు.. సంబంధాలు కూడా అంతే గొప్పవన్న మోడీ
-
Chandrayaan-3: చంద్రయాన్-3 సంచలన ఆవిష్కరణ.. చంద్రుడిపై బయటపడిన కొత్త నిజం
-
CM Revanth Reddy : బుల్లెట్ ట్రైన్ ల్యాండ్ అక్విజిషన్, టీ-ఫైబర్ పై సీఎం రేవంత్ డెడ్లైన్.!
-
Twisha Sharma : కుళ్ళిపోతున్న టాలీవుడ్ హీరోయిన్ డెడ్ బాడీ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!