విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టారు. నకిలీ ఆఫర్ లెటర్లు, నకిలీ వీసాలతో నిరుద్యోగులను మోసం చేశారు. కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాలనుకున్నారు. కానీ బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలి..డాలర్లు జేబులో వేసుకోవాలో.. డాలర్లు జేబులో వేసుకోవాలి…కోట్ల రూపాయలు కూడ పెట్టాలని ఎవరైనా కలలుకంటారు.. అంతేకాదు దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. విదేశాలకు కనీసం దొడ్డిదారిలోనైనా వెళ్లాలని ఆలోచిస్తారు.…
సగం రేటుకే బంగారం వస్తుందంటే నమ్మేశాడు. ఏకంగా కోటి రూపాయల బంగారం కావాలని ఆర్డర్ ఇచ్చాడు. రిటైల్గా బంగారం అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటే అసలుకే మోసం వచ్చింది. ఓ ముఠా స్మార్ట్గా చీట్ చేయడంతో.. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. కోటి రూపాయల బంగారం ఆర్డర్ ఇచ్చిన వ్యాపారి. సికింద్రాబాద్ పరిధిలోని ఆర్కే జ్యువెలరీ యజమానిని కొంత మంది ముఠా సంప్రదించింది. అతని వద్దకు నకిలీ పోలీసుల రూపంలో వెళ్లారు ఆరుగురు ముఠా సభ్యులు. వచ్చింది నిజం పోలీసులేనని జ్యువెలరీ…
Child Po*n: పిల్లలతో సంబంధిత అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి వాటిని షేర్ చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న యువకులపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అమెరికాలోని ఇంటర్నెట్ క్రైమ్ కంట్రోల్ రూమ్ (National Center for Missing & Exploited Children – NCMEC) నుంచి వచ్చిన సమాచారంపై స్పందించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం, హైదరాబాద్లో 18 మంది యువకులను అరెస్ట్ చేసింది. ఈ యువకులు ఇంటర్నెట్ ద్వారా చిన్న పిల్లల అశ్లీల వీడియోలు డౌన్లోడ్…
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుని హత్య కలకలం సృష్టించింది. చందానగర్ లోని గిడ్డంగి కల్లు కంపౌడ్ లో యువకుడిని దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నలుగురు మిత్రులు కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగడానికి వచ్చారు. అమ్రేష్ అనే యువకుడిని అతని ముగ్గురు స్నేహితులు కలిసి చంపేశారు. ఓ అమ్మాయి విషయంలో గొడవ జరిగింది.
బండ్ల గూడలో డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్ రూమ్ సూపర్ వైజర్తో కుమ్మక్కైన మోసగాళ్లు ప్లాట్ బాధితులకు చూపించారు. 40 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికేట్లు తయారు చేసి డబల్ బెడ్ రూమ్ మంజూరు అయినట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేశారు.
నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్కు ప్రత్యేక…
Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్భవన్లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్డిస్క్లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ…
Murder : నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలు ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని ఐదుగురు దుండగులు కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్కు టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతడిని…
Chandrayangutta Murder: మే 8న చంద్రాయణగుట్టలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత నిందితుడు జుల్ఫికర్ ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అతను పరుపుకు నిప్పంటించి మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించాడని డీసీపీ పి. కాంతిలాల్ సుభాష్ తెలిపారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం రావడంతో వారు జుల్ఫికర్ను అరెస్టు చేశారు. విచారణలో అతను ఆ మహిళను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతన్ని…
Fake Certificates: హైదరాబాద్లో నకిలీ విద్యా సర్టిఫికెట్ల విక్రయాలను చేపట్టిన ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం గుట్టురట్టు చేశారు. కన్సల్టెన్సీ పేరుతో మోసాలను కొనసాగిస్తూ యువత భవిష్యత్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ముఠాపై పోలీసులు ఘాటుగా స్పందించారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో ఈ నకిలీ దందాను నిర్వహిస్తున్న మహ్మద్ ముజీబ్ హుస్సేన్ను పోలీసులు పట్టుకున్నారు. మే 12న మాసబ్ ట్యాంక్లోని ప్రభుత్వ పాఠశాల వద్ద నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న సమయంలో…