మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పాండాతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ చేయగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో గత జనవరిలో చోరీ జరిగింది. ఫిల్మ్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కాచిగూడలో వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడి జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి డబ్బు నగలు దోపిడీ చోటు చేసుకుంది. వ్యాపారవేత్త హేమ రాజ్ ఇంట్లో రెండు కిలోల బంగారం ఆభరణాలు మూడు కోట్ల నగదు చోరీ చేశారు. పని మనుషులు.. వ్యాపారవేత్త దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. హేమ్రాజ్ దంపతులు మత్తుమందుతో కూడిన భోజనం తిని అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
Betting Apps : క్యాసినో బెట్టింగ్ యాప్ కారణంగా ఓ యువకుడి జీవితం ఘోరాంతమైంది. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పెట్టి నష్టపోయిన యువకుడు రాహుల్ చివరకు తన మిత్రుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ తన బెట్టింగ్ పార్ట్నర్ అయిన శాఖమూరి వెంకటేశ్కు రూ.3 లక్షల వరకు లోన్ ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగిన రాహుల్ను వెంకటేశ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం నంద్యాల నుంచి రాహుల్ను తీసుకువచ్చి షాద్నగర్లో దారుణంగా హత్య చేశాడు. Pakistan:…
Hyderabad Crime: హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో ఓ కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, ఆమె మృతదేహంపై డాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసిన యువకుడు స్థానికులను, పోలీసులను షాక్కు గురిచేశాడు. ఈ హృదయ విదారక ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. కుషాయిగూడలో ఒంటరిగా జీవిస్తున్న కమలాదేవి అనే వృద్ధురాలు తనకు చెందిన షాపులో ఓ యువకుడికి అద్దెకు ఇచ్చినట్టు సమాచారం. అద్దె విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కమలాదేవి…
POCSO : నాంపల్లి లోని పోక్సో (POCSO) కోర్టు శుక్రవారం సంచలన తీర్పుని వెలువరించింది. 2023లో రాజ్భవన్ మక్త ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్కు కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు ప్రకటనతో బాధిత కుటుంబానికి న్యాయం లభించిందన్న భావన నెలకొంది. వివరాల ప్రకారం, 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి మైనర్ బాలికను సెల్ఫోన్ ఇస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం…
Hyderabad: హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను భర్తే బండరాయితో పలుమార్లు కొట్టి హత్యకు యత్నించిన ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఈ ఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే వికారాబాద్కు చెందిన ఎండీ బస్రత్ (32), షబానా పర్వీన్ (22) దంపతులు హఫీజ్పేట్ ఆదిత్యనగర్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భిణి.…
Crime News: హైదరాబాద్ ముషీరాబాద్ బోయిగూడ ప్రాంతంలో చోటుచేసుకున్న ఫైనాన్సర్ దారుణ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ను వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫైనాన్సర్ సట్నం సింగ్ను నవీన్ ఈ నెల 4వ తేదీన కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య అనంతరం సంప్లో మృతదేహాన్ని సంపూలో పడేసి నేరం నుంచి తప్పించుకునేందుకు వైజాగ్కు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు.…
Murder : ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి స్వప్నం సింగ్ (59) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల నాలుగో తేదీన అల్వాల్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పిఎస్ లో 0 ఎఫైర్ నమోదు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అల్వాల్ లో నివాసం ఉండే స్వప్నం సింగ్ తన సోదరుడు హరిదీప్ సింగ్ ను ముషీరాబాద్…
పుట్టింది ఇండియాలో.. పెరిగింది అమెరికాలో.. ప్రస్తుతం బేగంపేట్ లో నివాసం.. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం ముంబైలో చేసిన ఉద్యోగంతో జోరుగా పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఇంకేముంది.. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి నుంచి డ్రగ్స్ అమ్మకం వ్యక్తిగా ఎదిగాడు. తేజస్ కట్ట (29) అనే వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాలో పుట్టినటువంటి తేజస్ కట్ట వన్ ఇయర్ ఉండగానే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లాడు అమెరికాలో పౌరసత్వం కూడా ఉంది. చివరకు…
Hulchul With Gun : హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డుపై ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ తుపాకీ ప్రదర్శన చేసి హంగామా సృష్టించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఓ గుంపు యువకులు ఓపెన్ టాప్ జీప్లో వేగంగా ప్రయాణిస్తూ గట్టిగా కేకలు వేయడం, రోడ్డు మీద వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఆకతాయితనాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా, జీప్ డాష్ బోర్డు…