జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందన్న కారణంతోనే అంజలిని.. కూతురు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కుమార్తె సహా ఆమెకు సహకరించిన శివ, అతని తమ్ముడు యశ్వంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
కూతురి చేతిలో హత్యకు గురైన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారిణి అంజలి మృతదేహానికి నివాళ్ళు ఆర్పించారు సాంస్కృతిక శాఖ కళాకారులు,డిపీఆర్ఓ రాజేందర్ ప్రసాద్. స్వగ్రామం ఇనుగుర్తి గ్రామంలో అంజలి అంతిమయాత్రలో కళాకారులు, జేఏసీ నాయకులు, కుల సంఘాలనాయకులు పాల్గొన్నారు. తక్షణ సహాయం కింద పదివేల రూపాయలను అంజలి కుటుంబ సభ్యులకు అందచేశారు డీపీఆరోఓ రాజేందర్ ప్రసాద్.. అంజలి మృతదేహానికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంజలి చిన్న కూతురు మనస్విని మాట్లాడుతూ అమ్మను చంపిన…
Hyderabad Brutal Murder: కంటే కూతుర్నే కనాలి అంటారు… కానీ, హైదరాబాద్ జీడిమెట్లలో ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని నిరూపించింది ఓ అమ్మాయి. కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. నవమాసాలు మోసి.. కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. కట్టంగూర్కు చెందిన శివ.. డీజేగా పని చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికకు శివ పరిచయం అయ్యాడు. దానితో పరిచయం కాస్త ప్రేమమగా…
Tragic : హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాలిక, ఆమె ప్రియుడు, అతని తమ్ముడు కలిసి మాతృహత్యకు పాల్పడిన ఈ ఘటన వెనక ప్రేమ, కోపం, హింసల మేళవింపుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఎనిమిది నెలల క్రితం ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వయసులో పదో తరగతి చదువుతున్న ఈ బాలిక అప్పటికే తన వయస్సును మరిచిపోయి ప్రేమలో మునిగిపోయింది.…
Hyderabad : హైదరాబాద్ నగరంలోని పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, విదేశీయుల అక్రమ నివాసాలపై ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 150 మంది పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ కాలనీని చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, హెచ్ఎన్యూ, ఏఆర్ విభాగాలకు చెందిన పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సెర్చ్లో నైజీరియా,…
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సరూర్నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా సీఐడీ పోలీసులు కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని..
Supspend : హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు. అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు. ఎస్ఐ లక్ష్మీనారాయణపై పలు అవినీతి అరోపణలు. ఓ మహిళ కేసు విషయంలో ముగ్గురిని అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లో బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు…