Physical Harassment : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలైన చెవిటి, మూగ యువతిపై స్థానిక యువకుడు అత్యాచారం చేసి, తరచూ వేధింపులకు గురిచేశాడు. చివరికి మానసిక వేదన తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ ఆల్మాస్గూడలో నివాసం ఉంటోంది. ఆ…
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది.
కంటే కూతుర్నే కనాలి అంటారు. చివరి దశలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చెబుతారు. కానీ హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ కూతురు చేసిన పని వింటే.. కంటే ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని చెప్పుకుంటారు. తుచ్ఛమైన వివాహేతర బంధం కోసం ఏకంగా కన్న తండ్రినే పొట్టన పెట్టుకుంది ఆ కసాయి కూతురు. ముషీరాబాద్ ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్గా పని చేస్తోంది. వీళ్ల కూతురు మనీషాకు…
హైదరాబాద్లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్పల్లిలో బర్త్డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా... నాగోల్లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి...?
వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా…
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్లో బ్యూటిషన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు... ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జీడిమెట్ల అంజలి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రేమ వ్యవహారానికి పదే పదే అడ్డొస్తుందన్న కారణంతోనే అంజలిని.. కూతురు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కుమార్తె సహా ఆమెకు సహకరించిన శివ, అతని తమ్ముడు యశ్వంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారని పోలీసులు చెబుతున్నారు.
కూతురి చేతిలో హత్యకు గురైన తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారిణి అంజలి మృతదేహానికి నివాళ్ళు ఆర్పించారు సాంస్కృతిక శాఖ కళాకారులు,డిపీఆర్ఓ రాజేందర్ ప్రసాద్. స్వగ్రామం ఇనుగుర్తి గ్రామంలో అంజలి అంతిమయాత్రలో కళాకారులు, జేఏసీ నాయకులు, కుల సంఘాలనాయకులు పాల్గొన్నారు. తక్షణ సహాయం కింద పదివేల రూపాయలను అంజలి కుటుంబ సభ్యులకు అందచేశారు డీపీఆరోఓ రాజేందర్ ప్రసాద్.. అంజలి మృతదేహానికి నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్. అంజలి చిన్న కూతురు మనస్విని మాట్లాడుతూ అమ్మను చంపిన…
Hyderabad Brutal Murder: కంటే కూతుర్నే కనాలి అంటారు… కానీ, హైదరాబాద్ జీడిమెట్లలో ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని నిరూపించింది ఓ అమ్మాయి. కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. నవమాసాలు మోసి.. కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన కన్న తల్లినే కర్కశంగా హత్య చేయించింది. కట్టంగూర్కు చెందిన శివ.. డీజేగా పని చేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలికకు శివ పరిచయం అయ్యాడు. దానితో పరిచయం కాస్త ప్రేమమగా…
Tragic : హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాలిక, ఆమె ప్రియుడు, అతని తమ్ముడు కలిసి మాతృహత్యకు పాల్పడిన ఈ ఘటన వెనక ప్రేమ, కోపం, హింసల మేళవింపుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఎనిమిది నెలల క్రితం ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వయసులో పదో తరగతి చదువుతున్న ఈ బాలిక అప్పటికే తన వయస్సును మరిచిపోయి ప్రేమలో మునిగిపోయింది.…