అధికారపార్టీలో అంతా ఉపఎన్నికపై ఫోకస్ పెడితే.. ఇటీవలే కండువా మార్చిన ఆయన మాత్రం ఇంకేదో షో చేస్తున్నారట. ఒంటరిగా వదిలేస్తే.. ఎక్కడ తలనొప్పులు తెచ్చిపెడతారో అని భయపడి.. ఆయన్ని వెంటేసుకుని మరీ తిరుగుతున్నారట సీనియర్ నాయకులు. పైగా బైఎలక్షన్ను వదిలిపెట్టి.. సొంత భవిష్యత్ కోసం భారీ స్కెచ్లు వేస్తున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరాయన? ఏమా కథ? కౌశిక్రెడ్డి చేరినప్పుడు హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు గుర్రు! హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. ఈటల రాజేందర్ రాజీనామా…
హుజురాబాద్లో ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేనా? ఆలస్యమయ్యే కొద్దీ ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం? జరుగుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్పై మూడు ప్రధాన పార్టీల ఫోకస్! మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్కు ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా రాలేదు. కానీ.. రాజకీయాన్ని రంజుగా మార్చాయి పార్టీలు. గెల్లు శ్రీనివాస్ను అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే అక్కడ…
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం.. హాట్ టాపిక్గా మారింది. అయితే, సర్కార్ సైతం.. ఈ పథకాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తోంది. దళిత సమాజానికి ఈ పథకం గురించి వివరిస్తూ.. ప్రత్యేక పాటలు రూపొందించి ప్రచారం కల్పిస్తోంది. ఇప్పుడెక్కడ చూసినా.. దీనిపైనే చర్చ జరుగుతోంది. దళితుల సాధికారత కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి అద్భుతమైన పాటలతో… అంతే స్థాయిలో ప్రచారం కల్పిస్తోంది…
హుజురాబాద్ ఎన్నికలకు సిద్దమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ అభ్యర్ధి ఎంపిక కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోవడం లేదు.. కానీ, పోటీలో కూడా లేకుండా పోతే ఎలా అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్ధి ఎంపిక చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుందనే లెక్కలు వేస్తోంది. దీంట్లో భాగం… మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అందుకు కొండా సురేఖ…
హుజురాబాద్ ఉపఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి వరకు భావించాయి. అయితే కరోనా పరిస్థితుల్లో ఎన్నికను నిర్వహించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? నిర్వహిస్తే ఎలాంటి నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందో చెప్పాలంటా రాజకీయ పార్టీలను సూచనలు, సలహాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఇందుకు ఈ నెల 30వ వరకు గడవు విధించింది. దీంతో ఎన్నికల షెడ్యూల్ ఇప్పట్లో వెలువడే…
హుజురాబాద్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగేది ఎవరు? బలమైన వ్యక్తి అనుకున్న నేత చేతులు ఎత్తేశారా? పార్టీ గాలం వేసిన వ్యక్తి కారెక్కేశారా? ప్రధానపక్షాలు క్లారిటీతో ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి? అభ్యర్ధిని తేల్చుతుందా.. నాన్చుతుందా? హుజురాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికకు పార్టీలు సిద్ధం. ప్రచారం హోరెత్తిపోతోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. అనేక వడపోతల తర్వాత TRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస…
హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించేసింది. ఈ మేరకు టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అధికారికంగా ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో…
హుజూరాబాద్ లో ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల సందడి నెలకొంది.. ఓవైపు అధికార టి ఆర్ యస్ పార్టీ ఒకడుగు ముందుకేసి నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో క్యాడర్ దించి హడావుడి చేస్తోంది. ఇప్పుడు మంత్రి హరీష్ రావు కూడా పూర్తిస్థాయిలో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో సమావేశమై హుజురాబాద్ ఎన్నికపై చర్చించనున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించే అవకాశం…
హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్లను నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఇక ఇది ఇలా ఉండగా..ఇవాళ హుజురాబాద్ ఉప ఎన్నికపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్.. పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాదు..…
త్వరలోనే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో కరోనా పరిస్థితులపై వైద్య శాఖ పరిశీలించింది. ఈమేరకు జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డా. శ్రీనివాసరావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో కోవిడ్ స్థితిగతులను చూడటానికి వైద్య ఆరోగ్య శాఖ బృందం రావడం జరిగింది. మేము సీఎం ఓఎస్డీ నరేందర్ బృందం జమ్మికుంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను విజిట్ చేసాం. జమ్మికుంట హెల్త్ సెంటర్ లో…