అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఒక తీవ్రమైన పోస్ట్లో, హార్మూజ్ జలసంధిని తెరవాలని ఆయన ఇరాన్ను హెచ్చరించారు. అలా చేయని పక్షంలో భారీ దాడిలు చేస్తామని బెదిరించారు. ఏప్రిల్ 6 గడువుకు ఒక రోజు ముందు అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై ఒత్తిడిని పెంచారు. మంగళవారం ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. Also Read:SRHvsLSG :…
India Thae Plan: అమెరికా-ఇరాన్ యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే భారత్ తన ‘‘థార్’’ ప్రణాళికను అమలు చేస్తోంది. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న…
Donald Trump: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ఉద్రిక్తంగా మారుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చమురు సంక్షోభం పెరిగింది. ఇదిలా ఉంటే, మరో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఇచ్చిన డెడ్లైన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు ఆదివారం ట్రంప్ భారీ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి, త్వరగా మాతో డీల్ చేసుకోకపోతే 48 గంటల్లో ఇరాన్ను నరకంగా మారుస్తామని, సమయం లేదని హెచ్చరించారు. Read Also:…
Donald Trump: మిడిల్ ఈస్ట్లో పరిణామాలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్పై దాడులు నిర్వహించాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో తీవ్ర యుద్ధం జరుగుతోంది. రెండు పక్షాలు కూడా తగ్గడం లేదు. ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే, చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని ఇరాన్ తన ఆధీనంలోకి తీసుకోవడం ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టింది.
India-Iran Relations: భారత్కు మరో గుడ్ న్యూస్. హార్ముజ్ జలసంధి దాటి, భారత్కు 7వ ఎల్పీజీ ట్యాంకర్ గ్రీన్ సాన్వీ వస్తోంది. దీనిపై ఇరాన్ ప్రత్యేక సందేశాన్ని పంచించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్.. ‘‘మన ఉమ్మడి చరిత్రలో భారతదేశానికి, ముఖ్యంగా గుజరాత్కు విశిష్ట స్థానం ఉంది’’ అని పేర్కొంది.
US-Iran War: అమెరికా ఇరాన్ యుద్ధం కీలక మలుపు తిరిగింది. అమెరికన్ ఫైటర్ జెట్ ఎఫ్-35ను కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే,ఇప్పుడు పైలట్ విషయంపై ఉత్కంఠ నెలకొంది. విమానం కూలిపోతున్న సమయంలో ఎజెక్ట్ బటన్ నొక్కి పారాశ్యూట్ ద్వారా నేలపై ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది.
US-Iran War: అమెరికా అధ్యక్షుడు ఇరాన్ యుద్ధం గురించి చేస్తున్న వ్యాఖ్యల్ని ఇరాన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమ డీల్కు ఒప్పుకోకుంటే ఇరాన్ను ‘‘రాతియుగానికి’’ తీసుకెళ్తామని అమెరికా చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సైనికాధికారి సయేద్ మజిద్ మూసావి మాట్లాడుతూ.. 250 ఏళ్ల చరిత్ర కలిగిన అమెరికా, 6000 ఏళ్ల నాగరికత కలిగిన మా దేశాన్ని బెదిరిస్తుందా? అని ఎద్దేవా చేశారు. Read Also: Karnataka: ప్రొఫెసర్తో ఎఫైర్ ఉందని రూమర్స్.. వైద్య విద్యార్థిని…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇరాన్ కొత్త నాయకత్వం కాల్పుల విరణమ కోరతూ తమను సంప్రదించిందని, అయితే హార్ముజ్ జలసంధి ప్రపంచ నౌకాయానానికి తిరిగి తెరిచే వరకు అమెరికా ‘‘కాల్పుల విరమణ’’ను పరిగణించదని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పారు. ఇరాన్ పాత నాయకత్వం కన్నా కొత్త వారు తక్కువ తీవ్రవాద భావాలు కలవారని, చాలా తెలివైనవారని…
Iran: ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నెల రోజులు గడిచింది. అయినప్పటికీ, ఇప్పటికీ యుద్ధం తీవ్రస్థాయిలోనే కొనసాగుతోంది. యుద్ధం తర్వాత చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుని నియంత్రిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజే అప్పటి సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హత్య చేయబడ్డాడు. ఇక ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంలీడర్గా ఎన్నికయ్యారు. అయితే, ఆయన కూడా యూఎస్-ఇజ్రాయిల్ దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అతడి…
NATO: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(NATO) సైనిక కూటమి నుంచి అమెరికా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మమీడియాతో మాట్లాడుతూ.. నాటో నుంచి బయటకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నాటో ఒక ‘‘పేపర్ పులి’’గా మారిందని అన్నారు. నాటో విశ్వసనీయత గురించి తనకు ముందు నుంచి అనుమానాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.