Kamal Haasan: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింటోంది. ఇప్పటికే ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇండియా, చైనాతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది.
మిడిల్ ఈస్ట్ లో చోటుచేసుకున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్పై ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రాత్రికి రాత్రే గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, హై-స్పీడ్ డీజిల్ ధర లీటరుకు 55 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. పాకిస్తాన్లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలో ఇదే భారీ పెరుగుదల. Also Read:Best Bikes: లీటరుకు…
India On Russian Oil: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిణామాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. గత శనివారం ఇజ్రాయిల్-యూఎస్ చేసిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించాడు.
Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు భారత వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. భారత్ నుంచి ఎక్కువగా సరకులు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం, ఇరాన్ ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో సముద్ర రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైళ్లు, డ్రోన్లతో అటాక్ చేస్తోంది. గగనతలంపై కూడా నిషేధం విధించబడింది. ఈ పరిణామాల గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి కావాల్సి వస్తువులు పేరుకుపోతున్నాయి.
LPG Production: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన రంగ సంక్షోభానికి కారణం కాబోతోంది. ఇప్పటికే ఇరాన్ చమురు రవాణాకు కీలకమైన ‘‘ హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. పెట్రోల్, LPG వంటి పెట్రోలియం నిల్వలు ప్రస్తుతం దేశంలో సరిపడా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.