Home
Hit And Run
Hit And Run News
-
Kerala: పిల్లిని కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి ..(వీడియో)
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. -
Hyderabad: దారుణం.. కానిస్టేబుల్పై బీర్ బాటిల్తో దాడి చేసిన బైక్ రేసర్..
హైదరాబాద్ బంజారాహిల్స్లో బైక్ రేసర్ బీర్ బాటిల్తో కానిస్టేబుల్పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. -
Hyderabad: నగరంలో పట్టపగలే హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువకుడు..
హైదరాబాద్లోని బాలనగర్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. మద్యం మత్తులో ఓ యువకుడు ఫార్చునర్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు. -
Hyderabad : మొదటి రోజు ఉద్యోగం చేసి వస్తుండగా ప్రమాదం.. యువ ఇంజనీర్ దుర్మరణం
హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది.… -
Hit and Run Case: నార్సింగిలో మరో హిట్ అండ్ రన్ కేసు..
హైదరాబాద్ నగరంలో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పరిధిలో హిట్ అండ్ రన్ కేసు ఇది రెండోది. శనివారం ఒక ఘటన జరగగా.. మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. -
Hit and Run Case: నార్సింగి పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు..
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. -
Hit and run: మహారాష్ట్రలో మరో హిట్ అండ్ రన్ కేసు.. కారు ఢీకొని యువకుడి మృతి
మహారాష్ట్రలో పూణె హిట్ అండ్ రన్ ఘటనను మరువక ముందే పాల్ఘర్లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం అతి వేగంగా దూసుకురావడంతో సాగర్ గజానన్ పాటిల్ అనే 29 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. -
HIT and RUN: కారు ఢీకొని అమాంతం గాల్లోకి ఎగిరిన రిటైర్డ్ ఉద్యోగి.. వీడియో వైరల్..
ఢిల్లీలోని నోయిడాలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడా లోని సెక్టార్ 53 వీధుల్లో పాలు కొనడానికి బయటకు వెళ్లిన ఓ 64 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని తెల్లటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ‘జనక్ దేవ్’ అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో.. వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న తెల్లటి కారు అవతలి వైపు… -
Durgam Cheruvu Cable Bridge: ఇకపై అక్కడ సెల్ఫీలు దిగితే ఫైన్, కేసు నమోదు.. పోలీసులు సీరియస్..!
హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ వద్ద ఉన్న దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జిపై తాజాగా హిట్ అండ్ రన్ సంఘటనలో ఇద్దరు యువకలు మృతి చెందారు. ఈ విషయం సంబంధించి హైదరాబాద్ పోలీసులు కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వస్తే మాత్రం కచ్చితంగా జరిమానాలతో పాటు కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో… -
Petrol Tankers Strike: రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె.. బంకుల వద్ద భారీగా క్యూ లైన్
రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిట్ అండ్ రన్' వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది.…
తాజావార్తలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
-
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!