Durgam Cheruvu Cable Bridge: ఇకపై అక్కడ సెల్ఫీలు దిగితే ఫైన్, కేసు నమోదు.. పోలీసులు సీరియస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ వద్ద ఉన్న దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జిపై తాజాగా హిట్ అండ్ రన్ సంఘటనలో ఇద్దరు యువకలు మృతి చెందారు. ఈ విషయం సంబంధించి హైదరాబాద్ పోలీసులు కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వస్తే మాత్రం కచ్చితంగా జరిమానాలతో పాటు కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అనేకమంది కేబుల్ బ్రిడ్జిపై ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.
Also read: Congress: కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
ముఖ్యంగా యువత కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, రీల్స్ చేయడం లాంటి వాటికోసం నానా హంగామా క్రియేట్ చేసి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శుక్రవారం రాత్రి బ్రిడ్జిపై సెల్ఫీలు దిగడం కోసం వెళ్ళిన ఓ ఇద్దరి యువకులను అటు పై వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా., మరొకరు చికిత్స పొందుతూ అక్కడ మరణించారు. మృతులను అనిల్, అజయ్ లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ రాత్రి సమయంలో బ్రిడ్జి ఎలా ఉంటుందన్న విషయంపై అక్కడికి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నా సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Also read: Karnataka: కాంగ్రెస్ నేత ఇంట్లోనే “పాకిస్తాన్” ఉంది.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
ఈ సంఘటన అర్ధరాత్రి సమయం 12:30 గంటలకు బ్రిడ్జిపై వేగంగా వస్తున్న ఇన్నోవా కారు., సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులు ఢీకొట్టడంతో జరిగింది. అయితే ప్రమాదం జరిగిన కారు మాత్రం యువకులకు ఏమైందన్నా విషయం కూడా గ్రహించకుండా ఆపకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో రికార్డు కావడంతో పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. దీనితో యువకుల మృతదేహాలని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎవరైనా సెల్ఫీల కోసం రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. కేబుల్ బ్రిడ్జీపై సెల్ఫీలు దిగితే ఫైన్ తోపాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపైకి ఫొటోల కోసం వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!