అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ... మరోవైపు జేసీ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో శివుడి విగ్రహావిష్కరణ. దీంతో.. ఇవాళ ఏం జరగబోతోందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. గతం వైసీపీ ప్రభుత్వ హయాంతో పాటు.. కూటమి సర్కార్లోనూ తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతూనే ఉన్నాయి.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ బోర్డర్లో ఏపీ నుంచి ధాన్యంతో వస్తున్న లారీలను తెలంగాణ అధికారులు గురువారం రాత్రి ఆపేశారు. దీంతో తంగెడ కృష్ణానది బ్రిడ్జిపై ధాన్యం లారీలు భారీగా నిలిచిపోయాయి. ధాన్యం లారీల నిలిపివేతతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణానది బ్రిడ్జిపై లారీలు అడ్డంపెట్టి డ్రైవర్లు ఆందోళన చేస్తున్నారు. ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలను వెంటనే పంపాలంటూ ఆందోళన చేపట్టారు. Also Read: Shreyas Iyer-BCCI: చూసుకోవాలి కదా శ్రేయాస్…
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కాశ్మీర్ అంతటా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా భయాందోళనతో వణికిపోతున్నారు. భారత ఆర్మీని చూసినా కూడా మహిళలు, చిన్నారులు గజగజలాడిపోతున్నారు. నిన్నటి ఘటనతో ఒక విధమైన భీతావాహ వాతావరణం ఏర్పడింది.
High Tension In Ramagiri: అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త మృతి రాజకీయ వేడిని రాజేసింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
SBI Bank: వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఖాతాదారుల ఆందోళనకు దిగారు. 2024 నవంబర్ 19వ తేదీన బ్యాంకులో చోరీ ఘటనలో బంగారం పోగొట్టుకున్న బాధితులు నిరసన చేస్తున్నారు.
Maoist: తెలంగాణ-ఛత్తీ్స్ గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నేటి (డిసెంబర్ 2) నుంచి జరగనున్న మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలకు దండకారణ్యం వేదికగా మారింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
హుజురాబాద్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నియోజక వర్గంలో దళిత బంధు రెండో విడత రాని వాళ్లు తనకు దరఖాస్తు ఇవ్వాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. దరఖాస్తు ఇవ్వడానికి వచ్చిన వారితో కలిసి స్థానిక అంబేద్కర్ చౌరస్తాకు బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడుకున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది.