కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో ఒక్కింటి వాడయ్యే అవకాశాలున్నాయి. ఆయనకు మంచి అమ్మాయిని వెతకాలని స్వయానా రాహుల్ తల్లి సోనియా గాంధీ హర్యానా మహిళకు సూచించింది.
మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్లో ఓ దారుణం చోటుచేసుకుంది.
ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.
Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో యమునా నది 45 ఏళ్ల గరిష్టస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. యమునా నది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరికలు జారీ చేశారు.
దొంగ భక్తుడు వెంటనే ఆలయంలోని హుండీని పగుల గొట్టాడు. అందులోని డబ్బును బయటకు తీసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఆంజనేయ స్వామికి రూ. 10 సమర్పించి రూ. 5,000 పట్టుకెళ్లాడు. అయితే, ఈ ఘటన హర్యానాలోని రెవారీ జిల్లాలో జరిగింది. ధరుహెరా పట్టణంలోని హనుమంతుడి ఆలయంలో ఈ దొంగతనం జరిగింది. ఆ దొంగ భక్తుడు చేసిన చోరీ మొత్తం ఆ గుడిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
అతనో పోలీసు.. అతను డ్యూటీలో భాగంగా ఈ- చలాన్లు విధిస్తుంటారు. ఇలా చలాన్లు విధించగా వచ్చిన డబ్బులను వారు ప్రతి రోజూ బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అలా డిపాజిట్ చేసిన డబ్బుల్లో నుంచి పోలీసులకు అవసరమైన సమయంలో స్టేషనరీ ఇతర అవసరాలకు ఆ నిధులను ఉపయోగించుకుంటారు.
తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడిందని ఆమెను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ దారుణ ఘటన హర్యానాలో ఫరీదాబాద్లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్లోని ఓ హోటల్లో 24 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు.
హర్యానాలో రైతులు ఆందోళన తీవ్రరూపం దాల్చింది.ఈ క్రమంలో జాతీయ రహదారి-44 ను రైతులు దిగ్బంధించారు. పొద్దు తిరుగుడు పంటకు మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న రైతులకు యూపీ, పంజాబ్ రైతులు మద్దతు తెలిపారు.