Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Traffic Diversions At Nh 16 Parking Arrangements In Guntur Due To Ysrcp Plenary 2022

YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ భద్రత, ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు..

Published Date :July 7, 2022 , 3:54 pm
By Sudhakar Ravula
YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ.. భారీ భద్రత, ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీకి సిద్ధం అవుతోంది.. వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావొచ్చాయి.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి.. తొలి రోజున సర్వమత ప్రార్ధనలతో ప్రారంభం అయ్యే ప్లీనరీ సమావేశాలు… రెండో రోజు సాయంత్రం సీఎం వైఎస్‌ జగన్ ప్రసంగంతో ముగియబోతున్నాయి.. వైపీసీ ప్లీనరీ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు, మరోవైపు ట్రాఫిక్‌ ఆంక్షలు కూడా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే వైసీపీ ప్లీనరీ సమావేశాల కోసం రేపు ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభంకానుంది.. ఒక్కో జిల్లాకు రెండు కౌంటర్లు కేటాయిస్తున్నారు.. రిజిస్ట్రేషన్ సమయంలో ప్లీనరీకి హాజరైన నేతలు, కార్యకర్తలకు స్పెషల్ కిట్ అందించనున్నారు.. జ్యూట్ బ్యాగ్‌తో ఆ కిట్ ఉండనుంది.. కిట్‌లో భాగంగా పార్టీ మేనిఫెస్టో, పార్టీ జెండా, 16 పేజీల సంక్షేమ పథకాల బుక్ లెట్, ప్రజలకు ముఖ్యమంత్రి సంతకంతో లేఖ, నవరత్నాల ముద్రతో ఒక మగ్, పెన్ను, నోట్ ప్యాడ్, ఫ్యాన్ గుర్తు కీ చెయిన్ ఇలా ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు అందజేయనున్నారు..

Read Also: Bhagwant Mann: పంజాబ్ సీఎం రెండో పెళ్లి.. అరవింద్ కేజ్రీవాల్ హాజరు

ఇక, సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నేతలు ఇలా ప్లీనరీలోనే ఉండనుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లీనరీ పరిసర ప్రాంతాలతో పాటు అటు వైపు వెళ్లే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్లీనరీ భద్రతా ఏర్పాట్లను సీపీ కాంతిరాణా టాటా పర్యవేక్షించారు.. ప్లీనరీ జరగనున్న రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు.. హనుమాన్ జంక్షన్‌ దగ్గర డైవర్షన్ పెనుమూడి బ్రిడ్జి మీదుగా హైవే 16 నుంచి హైవే 216కు దరా మళ్లించనున్నారు.. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను విజయవాడ రాకుండా ఇబ్రహీంపట్నం, మైలవరం మీదుగా హైదరాబాద్‌కు మళ్లించారు. ఇక, గన్నవరం నుంచి ఆగిరిపల్లి, కేసినపల్లి.. మీదుగా హైదరాబాద్‌ వెళ్లవచ్చు.. చెన్నై నుండి హైదరాబాద్, వైజాగ్ వచ్చే వాహనాలు డైవర్ట్ చేయనున్నారు.. దాచేపల్లి, పెనుమూడి బ్రిడ్జి మీదగా హైదరాబాద్‌ – వైజాగ్ రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.. చిలకలూరిపేట ట్రాఫిక్ డైవర్షన్‌తో పర్చూరు, చీరాల, చెరుకుపల్లి, పెనుమూడి బ్రిడ్జి, తాడికొండ, కొల్లూరు, కరకట్ట మీదుగా హైదరాబాద్‌ వెళ్లాల్సి ఉంటుంది.

మరోవైపు, వైసీపీ ప్లీనరీ కోసం వైజాగ్ నుంచి వచ్చే వాహనాలకు ఆర్కే వెనుజీయాలో పార్కింగ్ సదుపాయం కల్పించినట్టు సీపీ కాంతిరాణా టాటా వెల్లడించారు.. వీఐపీల వాహనాలకు నాగార్జున యూనివర్శిటీ ప్లే గ్రౌండ్‌లో పార్కింగ్ సదుపాయం ఉంటుందన్న ఆయన.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం నుంచి వాహనాలలో వచ్చే వారు కంతేరు జంక్షన్‌లో దిగాలని సూచించారు.. పార్కింగ్ ప్లేసెస్‌ పుల్లలమ్మ చెరువు, కేవీ రెడ్డి, చర్చ్ వద్ద మొత్తం 25 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు భారీ వాహనాలకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఆ వాహనాలకు ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. ఇక, ప్లీనరీ మొత్తం సీసీ‌ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు సీపీ కాంతిరాణా టాటా.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Guntur
  • Parking Arrangements
  • Traffic Diversions

తాజావార్తలు

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.

  • Sunil Narine-IPL: అల్లాటప్పా బ్యాటర్లను కాదు, టాప్ దిగ్గజాలనే సుస్సు పోయించాడు.. నరైన్‌తో మాములుగా ఉండదు!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

ట్రెండింగ్‌

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions