టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చిన వాళ్లం విజయవాడ నుంచి తెనాలికి మాత్రం రాలేమన్నారు. గోతులతో నిండిన ఈ రోడ్లపై ప్రయాణించాలంటే ప్రాణాంతకంగా ఉందని ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు.
అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని అమరావతిలో కట్టడాలను పలువురు నేతలతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు.
పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఉమ్మడి కూటమిలో అసంతృప్తి వెల్లువెత్తింది. తమకు న్యాయం జరగలేదని టీడీపీపై జనసేన నాయకులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గడచిన రెండేళ్లుగా తమకే సీటు అని ప్రచారం చేసి.. చివరి నిమిషంలో టీడీపీ సీటు దక్కించుకుందని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చెప్పేంతవరకు, జనసేనకు న్యాయం జరిగేంత వరకు.. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ కార్యక్రమాలకు కార్యకర్తలు దూరంగా ఉండాలనే…
తెలుగు చిత్రపరిశ్రమలో అతి పెద్ద నిర్మాణ సంస్థ అంటే మైత్రి మూవీ మేకర్స్.. ఎన్నో వందల సినిమాలను తమ బ్యానర్ పై నిర్మించారు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను నిర్మిస్తు జోరు మీద ఉన్నారు.. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్లో కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.. ఈ నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన ఆరంభంలోనే భారీ ప్రాజెక్టు లను నిర్మిచారు.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ సినిమాలను అందుకున్న ఈ నిర్మాణ సంస్థ…
గుంటూరు జిల్లాలో తెనాలి నాజర్ పేటలో కిరణా షాపు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి శంకర్ రావు అనే వ్యాపారి కుటుంబం ప్రయత్నించింది. ఇక, భార్య, కుమార్తె కుటుంబం విష గుళికలు మింగారు.