Pawan Kalyan: నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే.. గుంటూరు సభలో పవన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాను ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల లోనే పుట్టానని.. తనతో గొడవ పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు సభలో ఆయన మాట్లాడుతూ.. “నేను వస్తున్నానని తెలిసి, హెలికాప్టర్ రాకుండా హెలిపాడ్ తవ్వి వేశారు. వైసీపీ నాయకులకు బానిస గా బ్రతికే వాళ్ళు అంటేనే ఇష్టం. ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళు అంటే నచ్చదు. నీ ఆత్మగౌరవం పెంచే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను. ఆచార్య ఎన్జీరంగా పుట్టిన పొన్నూరు లో జరుగుతున్న సభ లో మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను. హెలిప్యాడ్ ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు పైన ఉగ్రవాద కేసులు పెట్టాలి. సాగునీరు ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు.ఉమ్మారెడ్డి లాంటి వారు ఆపార్టీ లోకి వెళ్ళినా జగన్ మరకలు పూసుకోవాల్సిందే. ఈ ప్రభుత్వం పై ప్రశ్నిస్తే కేసులు, పోరాడితే కేసులు పెట్టారు.దాడులు, గోతులు తప్ప ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఏమీ లేదు. కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి. ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందాలి.”
READ MORE: Hardeep Nijjar Killing: నిజ్జర్ హత్యలో విచారణ ముగ్గురికే పరిమితం కాదు.. కెనడా పీఎం కీలక వ్యాఖ్యలు..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
మన రాష్ట్రంలో యువతకు ఉపాధి, విద్య అవసరం.. వాటిని కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైందని పవన్ అన్నారు. “టాక్స్ లు,పెట్రోల్,నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం తప్ప చేసింది ఏమీ లేదు. 1939 లో ఈప్రాంతంలో వేద పాఠశాల వుంది. అర్చకుల పై దాడులు చేస్తున్నారు. బ్రాహ్మణ సంఘానికి అండగా వుంటాం. చేనేత కార్మికులు జీఎస్టీ కడుతున్నారు. రాబోయే రోజుల్లో కల్తీ మద్యం అమ్మిన వారిపై రౌడి షీట్ ఓపెన్ చేస్తాం.అంబటి రాంబాబు పోలవరం గురించి అడిగితే నాకు తెలియదు అంటాడు.మేము సినిమాలో డ్యాన్సులు చేస్తాం. మంత్రి పదవిలో ఉండి డ్యాన్సులు ఎలా చేస్తాడు. నాలాంటి వారిపైన దాడులకు పాల్పడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి.అంబటి రాంబాబు అల్లుడు రాంబాబు కు మురళికి ఓటు వెయ్యొద్దని చెపుతున్నాడు. కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలి. చెల్లికే ఆస్తులు ఇవ్వానివాడు మిమ్మల్ని ఎలా అభివృద్ధి చేస్తాడని అన్నారు.”
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!