Gujarat police denied stone pelting on Asaduddin Owaisi: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న వందేభారత్ ట్రైన్ పై దాడి జరిగిందని ఆరోపించారు ఆపార్టీ నేత వారిస్ పఠాన్. అయితే ఈ వాదనలను పోలీసులు ఖండించారు. అలాంటిదేం జరగలేదని గుజరాత్ పోలీసులు కొట్టిపారేశారు. తాను పార్టీ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న అహ్మదాబాద్ నుంచి వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడినట్లు వారిస్ పఠాన్ ఆరోపించారు.…
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ గుజరాత్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి షాక్ తగిలినట్టు అయ్యింది.. బీజేపీకి గుడ్బై చెప్పారు సీనియర్ నేత, మాజీ మంత్రి జేఎన్ వ్యాస్.. ఈ నేపథ్యంలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.. పార్టీలో ఫ్యాక్షనిజం పెరిగిపోయిందని, కొందరు నాయకులను కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పఠాన్ ప్రాంతంలో ఈ ఫ్యాక్షన్ వ్యవహారం తీవ్రంగా ఉందని మండిపడ్డారు.. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా…
అక్టోబర్ 30వ తేదీన గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
గుజరాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ బీజేపీ కొత్త ఎన్నికల నినాదాన్ని గుజరాతీలో ప్రారంభించారు. 'నేను ఈ గుజరాత్ని తయారు చేశాను' అంటూ ఎన్నికల నినాదాన్ని ప్రారంభించారు.
గుజరాత్లో మోర్బీలలో వంతెన కూలిన దుర్ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మున్సిపల్ విభాగం చీఫ్ ఆఫీసర్(సీవో)ను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. సీఈసీ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ఫిబ్రవరి 18,2023తో ముగుస్తోంది. గత 25 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ తిరుగలేని అధికారాన్ని చెలాయిస్తోంది. ఈ సారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను అధికారంలో ఉన్నానని చెబుతోంది.
Gujarat Election Dates To Be Announced At Noon Today: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించనుంది. డిసెంబర్-జనవరి నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించిన ఈసీ.. ఈ రోజు గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఫిబ్రవరి 18,2023తో గుజరాత్ అసెంబ్లీ ఐదేళ్ల కాల పరిమితి ముగియనుంది. దీంతో ఈ మధ్యలోనే ఎన్నికలను నిర్వహించనుంది ఎన్నికల…
గుజరాత్లో మోర్బీ వంతెన దుర్ఘటన 'యాక్ట్ ఆఫ్ గాడ్' అని బ్రిడ్జికి మరమ్మతులు చేసిన ఒరేవా కంపెనీ మేనేజర్ కోర్టులో వాదించారు. ఈ విషయాన్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు.
గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దాదాపు 135 మంది ప్రాణాలను బలిగొన్న మోర్బీ వంతెన దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు.
ఇదిలా ఉంటే మోర్బీ వంతెన కూలిన ఘటన సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ప్రమాదంపై రిటైర్డ్ జడ్జితో తక్షణమే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సాధ్యత, భద్రతను నిర్దారించేందుకు పాత వంతెనలను, స్మారక కట్టడాలను సర్వే, రిస్క్ అసెస్మెంట్ కోసం కమిటీని ఏర్పాటు చేయాడానికి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.