Arvind Kejriwal: గుజరాత్ వంతెన దుర్ఘటన.. నిందితులను బీజేపీ కాపాడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: అక్టోబర్ 30వ తేదీన గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన దుర్ఘటనలో దాదాపు 135 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. వంతెన మరమ్మతు పనులకు బాధ్యలైన వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. నిందితులను బీజేపీ కాపాడిందని ఆయన ఆరోపించారు. రోడ్షో సందర్భంగా మోర్బీలోని వాంకనేర్లో ప్రజలను ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగించారు. గుజరాత్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మోర్బీ వంతెనను నిర్మిస్తామని చెప్పారు.
ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ డబుల్ ఇంజిన్ అధికారంలోకి వస్తే మోర్బీ వంతెన కూలిపోవడం వంటి సంఘటనలు జరుగుతాయని విమర్శించారు. మోర్బీలో జరిగిన ఘటన చాలా బాధాకరమని.. చనిపోయిన వారివో 55 మంది చిన్నారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ విషాదానికి కారణమైన వ్యక్తులను రక్షించేందుకు ప్రయత్నాలు జరగడం బాధాకరమని ఢిల్లీ ముఖ్యమంత్రి అన్నారు. అక్టోబర్ 30న ఆదివారం సాయంత్రం మోర్బిలోని మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి ఝుల్తా పుల్ లేదా వేలాడే కేబుల్ వంతెన కూలిపోవడంతో 135 మంది మరణించారు.
Also Read
Viral Video: రిపోర్టింగ్ చేస్తుండగా ప్రత్యక్షమైన చిలుక.. ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెడతారు
“మీరు వారిని రక్షించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వారితో వారి సంబంధం ఏమిటి? దురదృష్టకర వంతెనను పునరుద్ధరించడానికి బాధ్యత వహించిన ఒరేవా గ్రూప్, దాని యజమాని పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదు, ‘ అని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పెద్దఎత్తున ఆప్కి ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదని కేజ్రీవాల్ అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి మొదలైనవాటికి సంబంధించి గుజరాత్ ప్రజలకు ఆప్ చేసిన వాగ్దానాలన్నీ ఢిల్లీలో తన ప్రభుత్వం చేసిన వాటిపై ఆధారపడి ఉన్నాయన్నారు.
“నేను చదువుకున్న వ్యక్తిని. పని చేయడం, పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించడం నాకు తెలుసు. నేను ఢిల్లీలో చేసిన పని. నేను నిజాయితీపరుడిని, అవినీతికి పాల్పడను, మీరు బీజేపీకి 27 ఏళ్లు ఇచ్చారు.. ఐదేళ్లు కావాలనే నేను ఇక్కడ ఉన్నాను.. మాకు ఐదేళ్లు ఇవ్వండి.. మేం ఇవ్వకపోతే ఓట్లు అడగడానికి నేను రాను” అని ఆయన అన్నారు. గుజరాత్లో పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్ల నిర్మాణం, యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రణాళికను రూపొందించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. గుజరాత్లో మార్పు తుఫాను రాబోతోందని కేజ్రీవాల్ అన్నారు.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..