Ravindra Jadeja Wife: బీజేపీ అభ్యర్థుల జాబితాలో రవీంద్ర జడేజా భార్య.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja Wife: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదోసారి గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది. డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బీజేపీ సిద్ధం చేసింది. ఈ జాబితాలో మూడు సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివా జడేజా పేరు కూడా ఉన్నట్లు, అభ్యర్థులను ఖరారు చేయడానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ రోజు సమావేశం కానుందని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ.. ఈ ఎన్నికల్లో కొందరు సీనియర్లను పక్కన పెట్టాలని యోచిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ వంటి సీనియర్ నేతలను పోటీకి దింపకపోవచ్చు. 75 ఏళ్ల వయోపరిమితి నిబంధనలు అమలుచేస్తుండటంతో వారు అనర్హులు. ఎంపీలు, ఎమ్మెల్యేల బంధువులు కూడా అనర్హులు. ఈ నేపథ్యంలో ఈ సీనియర్ నేతలకు చోటుదక్కే అవకాశం లేదు.
GVL Narasimha Rao: ప్రధాని మోడీ వైజాగ్ పర్యటన.. ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
రవీంద్ర జడేజా భార్య రివా జడేజా మెకానికల్ ఇంజినీర్ డిగ్రీ పూర్తి చేశారు. అంతే కాకుండా, కాంగ్రెస్ సీనియర్ నేత హరిసింగ్ సోలంకికి బంధువు. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకుంది. ఆమె రాజ్పుత్ కమ్యూనిటీకి చెందిన కర్ణి సేనకు కూడా నాయకురాలు.కాంగ్రెస్కు నుంచి బీజేపీలో చేరినహార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్లకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాబితాలో ఉండరని పలు వర్గాలు వెల్లడించాయి.బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలోని ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు సభ్యులుగా ఉన్న సెంట్రల్ కమిటీ సమావేశం అనంతరం జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ, అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి, హిమాచల్ ప్రదేశ్లో కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!