Bajaj Finance : భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ నాన్-బ్యాంకింగ్ రుణదాత మరియు బజాజ్ ఫిన్సర్వ్లో భాగమైన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఈ పండుగ సీజన్లో వినియోగ ఫైనాన్స్లో పెరుగుదల కనిపించిందని, రికార్డు స్థాయిలో వినియోగదారుల రుణాలను పంపిణీ చేసిందని, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వాల్యూమ్లో 27% మరియు విలువలో 29% ఎక్కువగా ఉందని ఈరోజు తెలిపింది. వినియోగ వస్తువుల కోసం రుణాల ద్వారా ప్రాతినిధ్యం వహించే వినియోగ క్రెడిట్ పెరుగుదల, వినియోగదారుల కొనుగోలు…
CM Chandrababu: విజయవాడ నగరంలోని ప్రధాన వ్యాపార కూడలి బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చిరు, వీధి వ్యాపారులతో ఆయన మాటామంతీ నిర్వహించారు. బీసెంట్ రోడ్డులో కాలినడకన చిరు వ్యాపారుల వద్దకు వెళ్ళిన సీఎం.
GST 2.0 report: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలు సామాన్యుడికి మేలు చేశాయని కేంద్రమంత్రులు చెప్పారు. జీఎస్టీ రిపోర్టును మీడియాతో పంచుకున్నారు. జీఎస్టీ రేటు తగ్గింపుల వల్ల తగ్గిన పన్నుల ప్రయోజనాలు దేశ ప్రజలకు అందాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రమంతులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్లతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. దసరా ముందు వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగాయని ఆమె చెప్పారు.
CM Chandrababu: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లోని విజేతలను ముఖ్యమంత్రి సచివాలయంలో కలిశారు. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 17 మంది విద్యార్థినీ విద్యార్థులు విజేతలుగా నిలిచారు.
GST Effect: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో, మార్కెట్లో కొనుగోళ్ల ప్రభావం కనిపిస్తోంది. పండగ సీజన్ కూడా కావడంతో మార్కెట్ లో సందడి నెలకొంది. సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు, కార్లపై గతంలో 28 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 18 శాతానికి తగ్గించింది. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో, తగ్గిన ధరల కారణంగా తమకు అవసరమయ్యే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు నవరాత్రి, దీపావళి…
రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్గా జీఎస్టీ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్’ అని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలతో మేడిన్ ఇండియా మరింత బలోపేతం అవుతోందన్నారు. బలమైన, సమతుల్యమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని సీఎం చెప్పారు. దసరా నుంచి దీపావళి వరకు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహిస్తామని సీఎం తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు…
రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ అర్ధం కావాలంటూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో కమర్షియల్ టాక్స్ చూశాను.. తర్వాత వ్యాట్ వచ్చింది.. వేరే రాష్ట్రంలో నుంచి వస్తువులు వస్తే ఎంట్రీ టాక్స్ ఉండేది.. టాక్స్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయిందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు జీఎస్టీ ప్రవేశ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మోడీ ప్రధానిగా జీఎస్టీ అమలు చేస్తున్నారన్నారు.. అయితే,…
జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయి అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం అంటూ ప్రశంసలు గుప్పించారు.. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా.. సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది.
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూర్చింది. ఆగస్టు నెలలో రూ. 1.86 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలం కంటే 6.5 శాతం ఎక్కువ. ఆగస్టు 2024లో రూ. 1.75 లక్షల కోట్లు వసూల్ అయ్యాయి. మరోవైపు, గత నెల గురించి మాట్లాడుకుంటే, జూలై 2025లో, జీఎస్టీ వసూళ్ల నుంచి ప్రభుత్వ ఖజానాకు రూ. 1.96 లక్షల కోట్లు…