GST Effect: టీవీల నుంచి కార్ల వరకు తెగ కొనేస్తున్నారు.. జీఎస్టీ ఎఫెక్ట్తో ఆల్-టైం హై షాపింగ్..
- మార్కెట్పై జీఎస్టీ ఎఫెక్ట్..
- కొనుగోళ్లలో జోరు చూపిస్తున్న ప్రజలు..
- పెరిగిన ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST Effect: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో, మార్కెట్లో కొనుగోళ్ల ప్రభావం కనిపిస్తోంది. పండగ సీజన్ కూడా కావడంతో మార్కెట్ లో సందడి నెలకొంది. సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు, కార్లపై గతంలో 28 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 18 శాతానికి తగ్గించింది. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో, తగ్గిన ధరల కారణంగా తమకు అవసరమయ్యే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు నవరాత్రి, దీపావళి పండగకలు కూడా మార్కెట్కు ఊపునిచ్చింది.
Read Also: Viral Video: ఇదే నా పేరు.. ఏం పీ*టావో పీ*క్కో.. ఫిర్యాదుదారులపై మహిళా పోలీసు దౌర్జన్యం(వీడియో)
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
ఆల్ టైం హైకి ఆటోమొబైల్స్ అమ్మకాలు:
కొత్త పన్ను విధానంతో వినియోగదారులు కార్లు, బైకుల్ని కొనుగోలు చేస్తున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ ఎప్పుడూ లేని విధంగా కొనుగోళ్లను చూస్తోంది. 4 మీటర్ కార్లు 18 శాతం పన్ను స్లాబ్లోకి మార్చడంతో ధరలు తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా షోరూంలలో సందడి నెలకొంది. మారుతి 80,000 ఎంక్వైరీలను, 30,000 డెలివరీలతో 35 ఏళ్లలో అత్యుత్తమ సింగిల్ డే పనితీరును నమోదు చేసింది. సాధారణ పండగ సీజన్లతో పోలిస్తే చిన్న కార్ల బుకింగ్స్ 50 శాతం పెరిగాయి.
సెప్టెంబర్ 22న డీలర్ బిల్లింగ్స్ 11,000 పెరగడంతో హ్యుందాయ్ కూడా 5 ఏళ్ల తర్వాత అత్యుత్తమ రోజును చూసింది. టాటా మోటార్స్ ఏకంగా 10,000 కార్లను డెలివరీ చేసింది. 25,000 కన్నా ఎక్కువ ఎంక్వైరీలు నమోదైనట్లు చెప్పింది.
ఈ-కామర్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులకు డిమాండ్:
ఈ కామర్స్లో బట్టల దగ్గర నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీనికి తోడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు తమ సేల్స్ని ప్రకటించడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీనికి జీఎస్టీ కూడా తోడవ్వడంతో వస్తువుల ధరలు మరింత తగ్గాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ రెండింటిలోనూ ట్రాఫిక్ గత వారంతో పోలిస్తే 151 శాతం పెరిగింది.
పండగ సీజన్ కావడంతో కొత్త టీవీలు, ఏసీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషిన్స్ వంటి వాటిని వినియోగదారుడు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఏసీల ధరలు ఏకంగా రూ. 3000- రూ.5000 వరకు తగ్గాయి. హై ఎండ్ టీవీల ధరలు ఏకంగా రూ. 85000 వరకు తగ్గాయి.
హైయర్ కంపెనీ సోమవారం సాధారణ అమ్మకాల కంటే దాదాపు రెట్టింపు అమ్మకాలను నమోదు చేసింది. కొత్త రేట్లు అమలులోకి రాకముందే ప్రీ బుకింగ్స్ జరిగాయి. బ్లూ స్టార్ తన మొదటి రోజు అమ్మకాలను గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగినట్లు చెప్పింది. ముఖ్యంగా 43- ఇంచ్, 55- ఇంచ్ టీవీల అమ్మకాలు భారీగా పెరిగాయి.
తాజావార్తలు
-
Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
-
Ben Stokes Returns: ‘క్రికెట్పై మళ్లీ ఆసక్తి వచ్చింది’.. రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ ఆల్రౌండర్
-
Lockup Death: ఏపీలో లాకప్ డెత్లు పరంపర.. రెండు జిల్లాల్లో ప్రకంపనలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!