బంగారం ధరలు రోజురోజుకూ ఠారెత్తిస్తున్నాయి. ఈ వారంలో రెండు రోజులు తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధించారు. ఈ ప్రభావం పసిడిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోయాయి. రెండు రోజుల పాటు తగ్గినట్టే తగ్గి.. శుక్రవారం మళ్లీ షాకిచ్చాయి. ఫార్మా దిగుమతులపై ట్రంప్ 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో బంగారం ధరలకు కూడా రెక్కలొచ్చాయి. తులం బంగారంపై రూ.440 పెరిగాయి. సిల్వర్పై ఏకంగా 3,000 పెరిగింది. దీంతో ఆల్టైమ్ రికార్డ్ దిశగా వెండి ధర దూసుకెళ్తోంది.
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం ధరలకు బ్రేక్లు పడ్డాయి. గత కొద్దిరోజులుగా జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న గోల్డ్ రేట్స్కు కళ్లెం పడ్డాయి. రెండు రోజుల నుంచి బంగారం ధరలు నెమ్మది.. నెమ్మదిగా తగ్గుతున్నాయి. బుధవారం కొంచెం ఉపశమనం కలిగించగా..
Story board: బంగారం ధర మరోసారి ఆల్టైం హై కి చేరింది. పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష రూపాయల 20 వేలకు చేరువైంది. పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. పెరగడమే…
పసిడి ప్రియులకు ఉపశమనం లభించింది. ధరలకు బుధవారం కళ్లెం పడింది. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న ధరలు నేడు మాత్రం బ్రేక్లు పడ్డాయి. తులం గోల్డ్ ధరపై రూ.320 తగ్గింది.
బంగారం ధరలు దడపుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ వణికిస్తున్నాయి. గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 15 వేల వైపు పరుగులు తీస్తోంది. పుత్తడి బాటలోనే సిల్వర్ పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. లక్షా 49 వేలకు చేరింది. ఇవాళ గోల్డ్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఒక్కరేజే రూ. 1260 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం…
ట్రంప్ సుంకాల ప్రభావమో.. లేదంటే హెచ్ 1బీ వీసాల ప్రభావమో తెలియదు గానీ.. బంగారు ధరలు మాత్రం పైపైకి వెళ్లిపోతున్నాయి. ధరలు తగ్గితే కొందామనుకుంటున్న గోల్డ్ ప్రియులకు రోజురోజుకు ధరలు షాకిస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో ధరలు దూసుకుపోతున్నాయి.
లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని…
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదుర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం వృద్ధ మహిళను చేద బావిలో తోసేశారు గుర్తుతెలియని దుండగులు. ఈరగని రాధమ్మ (75) అనే వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ గుర్తు తెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వృద్ధ మహిళ మెడలో ఉన్న బంగారు చైన్ ను లాగే ప్రయత్నం చేసిన దుండగులు.. మెడలో ఉన్న చైన్.. ఆ వృద్దురాలు వదలకపోవడంతో తల మీద గాయపరిచి…
పసిడి ప్రియులకు భారీ షాక్. బంగారం ధరలు మళ్లీ కొండెక్కి కూర్చున్నాయి. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధరలకు గురువారం బ్రేకులు పడ్డాయి. దీంతో తగ్గుముఖం పడతాయని అనుకుంటున్న సమయంలో మళ్లీ పైపైకి వెళ్లిపోతున్నాయి.