Delhi: ఢిల్లీలో భారీగా డ్రగ్స్, బంగారం, గంజాయి పట్టివేత
- ఢిల్లీలో భారీగా డ్రగ్స్, బంగారం, గంజాయి పట్టివేత
- పక్కా ప్రణాళికతో ఛేదించిన ఢిల్లీ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమపై అధికారుల బృందం దాడులు చేశాయి. రూ.108 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పరిశ్రమలో 7.9 కేజీల కొకైన్, 1.8 కేజీల హెరాయిన్, 16.27 కేజీల Amphetamineతో పాటు 115 కేజీల ముడి సరుకులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో మరో ఎన్కౌంటర్.. పోలీసుల అదుపులో నిందితుడు
Also Read
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
- Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!
ఇక ఢిల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. విదేశీ గంజాయికి అడ్డాగా దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మారింది. రూ.48 కోట్ల విలువ చేసే 48 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 4 రోజుల ఆపరేషన్లో కస్టమ్స్ బృందం 15 మంది స్మగ్లర్స్ ఆట కట్టించారు. బ్యాంకాక్ నుంచి దర్జాగా విదేశీ గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా కేటుగాళ్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయిని ప్లాస్టిక్ కవర్స్లో ప్యాకింగ్ చేసి లగేజ్ బ్యాగ్లో దాచి తరలించే యత్నం చేస్తున్నారు. విదేశీ గంజాయికి మెయిన్ హబ్గా బ్యాంకాక్ మారింది. కేజీలకు కేజీల విదేశీ గంజాయి ఇండియాకు సరఫరా అవుతోంది. చాకచక్యంగా వ్యవహరించి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మటు వేసి పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడి కదలికలపై నిఘా పెట్టారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే.. యూఎన్లో భారత్ స్పష్టీకరణ
అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విదేశీ బంగారం కూడా పట్టుబడింది. కోటి రూపాయల విలువ చేసే 1 కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బర్మా నుంచి ఢిల్లీ చేరుకున్న ఓ లేడి కిలాడి దగ్గర బంగారం గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా బంగారు బిస్కెట్స్ను లోదుస్తులలో దాచి తరలించే యత్నం చేసింది. స్ర్కీనింగ్లో బంగారు గుట్టు రట్టు అయింది. దీంతో లేడి కిలాడీని అధికారులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Tags
- Amphetamine
- Delhi
- Drugs
- Ganja
- Gold
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!