గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం, సాధారణ సర్వ సభ్య సమావేశం మంగళవారం ఉదయం 10 .30 గంటలకు వర్చ్యువల్ గా జరుగుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. కోవిడ్ నియమ, నిబంధనల నేపథ్యంలో మొదటి సారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశం వర్చ్యువల్ గా నిర్వహించేందుకు సభ్యులందరికి ఐ.డి లను పంపించారు. రేపు జరిగే ఈ సమావేశంలో మొదటగా నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి ప్రసంగిస్తారు. నగరంలో జరగుతున్న అభివృద్ధిని వివరిస్తూ మేయర్ ప్రసంగించనున్నారు. అనంతరం.. 2021…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రొగ్రామ్(సీఆర్ఎంపి) కింద ఏర్పాటు చేసిన రోడ్డుపై మ్యాన్హోల్ లేని ఉదంతంపై తక్షణమే భాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని…
తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ కేసులు తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉద్ధృతి మరింత…
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కాపాలదారు కూతురు(13)పై జిహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మహదేవపురంలో ఉన్న జంతువుల సంరక్షణ కేంద్రం (Animal Care center)లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెల్టర్ మేనేజర్ గా గత కొన్నేళ్లుగా ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ రావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటూ జంతువుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే బాధిత బాలిక…
10 రోజుల తాత్కాలిక బ్రేక్ తర్వాత తెలంగాణలో ఇవాళ్టి నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైందే.. ఇక, ఇదే సమయంలో.. వ్యాక్సినేషన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 28వ తేదీ నుంచి సూపర్ స్పైడర్స్ అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలనే నిర్ణయానికి వచ్చింది.. ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్వెజ్ మార్కెట్లు, కిరాణా…