జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని… Ghmc పరిధిలో సుమారు 40 వేల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. వీటిలో కోన్ని 3 వ రోజు, 5 వ రోజు మరికొన్ని విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగిందని… ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శోభాయాత్ర, నిమజ్జనం జరిగేలా…
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,261 శాంపిల్స్ పరీక్షించగా.. 259 మందికి పాజిటివ్గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్బారినపడి మృతిచెందగా.. 301 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,785కు చేరగా.. రికవరీ కేసులు 6,53,603కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్తో 3,900 మంది ప్రాణాలు…
హైదరాబాద్ ట్యాంక్బండ్లో వినాయక నిమజ్జనంపై ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో.. జీహెచ్ఎంసీ.. సుప్రీంకోర్టులో అప్పీల్కు వెళ్లింది. ఈ ఏడాది నిమజ్జనాలకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అప్పీల్ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. రేపు విచారణ చేపట్టనుంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది.…
నిమజ్జనంపై తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. హైకోర్టు తీర్పుతో సిటీలో గణేశ్ నిమజ్జనంపై .. గందరగోళం నెలకొంది. నిమజ్జనం నిబంధనలకు సంబంధించి తీర్పును పునఃసమీక్షించలేమని.. హైకోర్టు తేల్చి చెప్పడంతో సిటీలోని భారీ గణనాథుల నిమిజ్జనంపై సందిగ్ధం ఏర్పడింది. ట్యాంక్ బండ్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు నిరాకరించడంతో.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది జీహెచ్ఎంసీ. దీనిపై రేపు ఉదయం విచారణ చేపట్టనున్న అత్యున్నత ధర్మాసనం.. ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠరేపుతోంది. ఇప్పటికే ట్యాంక్ బండ్లో…
వినాయక నిమజ్జనం అంటేనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ వైపే చూస్తారు.. ముఖ్యంగా నిమజ్జన శోభాయాత్ర.. హుస్సేన్సాగర్లో వినాయక నిమజ్జన కార్యక్రమంపైనే అందరి దృష్టి.. అయితే, ఈ ఏడాది హుస్సేన్సాగర్లో నిమజ్జనం ఉంటుందా? లేదా? అనేది మాత్రం ఇంకా ఉత్కంఠగానే మారిపోయింది… వినాయక విగ్రహాల నిమజ్జనంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ).. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్…
సినీ నటుడు సాయి ధరమ్ తేజ్కు రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే సృష్టించింది.. హైదరాబాద్లో బైక్ స్కిడ్ అయి ఆయన పడిపోయారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ పరిస్థితి నిలకడగా ఉందని.. శ్వాస తీసుకోవడం కొంత మెరుగైందని తాజా హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు అపోలో వైద్యులు.. మరోవైపు.. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు.. రోడ్ల మీద భవన…
భారీ వర్షాలు.. కాలనీల మునక హైదరాబాద్లోని కార్పొరేటర్లకు కష్టాలు తెచ్చి పెడతున్నాయా? అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి ఎలా ఉన్నా.. బీజేపీ కార్పొరేటర్లకు చిక్కులు తప్పడం లేదా? బాధితులను ఓదారుస్తున్నా.. లోపల మాత్రం ఆ పార్టీకి ఎక్కడో తేడా కొడుతోందా? అప్పట్లో గొంతెత్తిన బీజేపీ నేతలు.. ఇప్పుడు మౌనం..! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలిటిక్స్ గమ్మత్తుగా మారిపోతున్నాయి. గతంలో నగరంలో ఏవైనా సమస్యలుంటే.. ప్రతిపక్షాలు గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీసేవి. సమస్యల పరిష్కారం కోసం పెద్దఎత్తున ఆందోళనలు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు.. సిరిసిల్లా టౌన్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.. పార్క్ చేసిన కార్లు.. పడవలుగా మారిపోయాయి కొట్టుకుపోయాయి.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే.. ముంపులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నవారు మరికొందరు.. అయితే, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సిరిసిల్లాకు బయల్దేరాయి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు.. హైదరాబాద్లో వరదల సమయంలో.. డీఆర్ఎఫ్ బృందాలు చాలా కీలక పాత్ర పోషించాయి..…
తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇక, హైదరాబాద్ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఓవైపు జంట జలశాయాలు నిండు కుండల్లా మరడంతో.. గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంతాలో ఇళ్లలోకి నీరు చేరి పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఇక, వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడనుందని హెచ్చరించింది వాతావరణశాఖ.. సాయంత్రం 6 గంటల నుంచి 8…
నేడు గ్రేటర్ హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంచల్ గూడ లో జీహెచ్ఎంసీ నిర్మించిన 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. హైద్రాబాద్ ను స్లమ్ ఫ్రీ సిటీగా చేసేందుకు గతంలో మురికివాడగా ఉన్న పిల్లి గుడిసెల బస్తీ… లో రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిచింది జీహెచ్ఎంసీ. ఒకటిన్నర ఎకరాలు ఉన్న ఈ స్థలంలో 288 డబుల్…