శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలు మూడు అపార్ట్మెంట్లు, ఆరు టవర్లుగా వర్థిల్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించారు నగర జీహెచ్ఎంసీ అధికారులు. మొఘల్స్ కాలనీలో ఐదు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు సర్కిల్ 6 అధికారుల బృందం. పలు సార్లు అక్రమ నిర్మాణాలపై యాజమానులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఈ ఉదయం కూల్చివేత శ్రీకారం చుట్టారు అధికారుల బృందం.
భారీ పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సహాయంతో నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. దీంతో అధికారులకు -యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎక్కడా లేని నిర్మాణాలు మా కాలనీలో కనబడుతున్నాయా అంటూ వారు మండిపడ్డారు. లంచాలు తీసుకొని పని చేస్తున్నారు అంటూ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కాలనీ వాసులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొఘల్స్ కాలనీకి భారీగా చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.