కడపలో చెత్త వివాదం కాస్తా.. కడప మేయర్ సురేష్ బాబుతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ నేతలపై కేసుల నమోదు వరకు వెళ్లింది.. చెత్త వివాదం ఘటనలో ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో విపక్షాలు మూకుమ్మడిగా అధికార వైసీపీపై మండిపడుతున్నాయి. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజా ఉద్యమాల అంటే సీఎం జగనుకు అంత ఉలుకెందుకు..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయి. ఈ నెల 9న సీపీఐ ఛలో అమరావతికి పిలుపునిస్తే రెండు రోజుల ముందు నుండే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సీపీఐ, ప్రజా సంఘాల…
రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్తున్నారా.. రద్దీ ప్రాంతాల్లో ఏదో ఒక మూల కార్ నిలిపి షాపింగ్ కి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ కార్, బైక్ పార్క్ చేసి వెళ్తే ఇక పై కుదరదంటూ హెచ్చరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో ఇక పై పార్కింగ్ చేసే వాహనాలపై ఫీజు వసూలు చేసేందుకు సిధ్దమవుతున్నారు. ఇప్పటికే ఎడాపెడా పన్నులతో ఇబ్బందులు పెడుతున్న మున్సిపల్ కార్పోరేషన్ పార్కింగ్…
బెజవాడ కార్పోరేషన్ పనితీరుపై విపక్ష టీడీపీ నిరసన తెలుపుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా కౌన్సిల్ హాల్ కి నిరసన తెలుపుతూ వెళ్లారు టీడీపీ కార్పొరేటర్లు. విజయవాడ నగర పాలక సంస్థ మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వైసీపీ పాలకపక్షంపై కార్పోరేటర్ కేశినేని శ్వేత మండిపడ్డారు. ఈ బడ్జెట్ నగర ప్రజలకు గుదిబండగా మారబోతుందన్నారు. గత మూడు సంవత్సరాలు నుండి నగరంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం. గత సంవత్సర కాలం…
ఏపీలో జగన్ పాలనా తీరుపై తనదైన రీతిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన సర్పంచ్లే నిజమైన హీరోలు అన్నారు. జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు.గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే మైనింగ్, ఇసుక క్వారీలపై పంచాయతీలదే అధికారం అన్నారు. నరేగా నిధులు కూడా పంచాయతీలకు రావాల్సిందే. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను…
టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఒక అలవాటుగా మారి మాటల దాడి చేస్తున్నారు. ఏదో విధంగా , ఏవేవో కధనాలు రాసి వాటి పైన ప్రతి పక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తున్నారు. ప్రజల్లో రాజకీయ లబ్ది పొందడం కోసమే దిశగా ప్రవరిస్తున్నారు. ఎన్టీపీసీకి …ప్రభుత్వానికి కొంత గేప్ వచ్చింది. రెండు రోజులు పాటు ఇబ్బందులు వచ్చాయి. లేదని నేను చెప్పలేదన్నారు బొత్స. సమస్య అయిపోయిన తరవాత…