ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ క్రికెట్ ప్రేమికులకు గుడ్న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్లోని కొన్ని ముఖ్యమైన మ్యాచ్లను దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రేక్షకులకు స్టేడియం తరహా అనుభూతిని అందించడమే లక్ష్యంగా తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వీకెండ్ మ్యాచ్లు, ప్లేఆఫ్లను థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆసియా కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో శ్రీలంక-పాకిస్తాన్ తలపడింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ పై శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది.
మహిళల ఆసియా కప్లో భాగంగా.. ఈరోజు బంగ్లాదేశ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 81 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు కేవలం 11 ఓవర్లలోనే ఛేదించారు. భారత్ ఓపెనర్లు స్మృతి మంధాన (55*), షఫాలీ వర్మ (26*) పరుగులు చేశారు. దీంతో.. భారత జట్లు ఫైనల్స్లోకి ప్రవేశించింది.
రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అదరగొట్టింది. బార్బడోస్లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని, 17 ఏళ్ల తర్వాత రెండో టీ20 ప్రపంచకప్ను భారత్ గెలుచుకుంది. కాగా.. ఫైనల్కు ముందు భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు కెప్టెన్ రోహిత్ చెప్పిన మాటలను స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు బయటపెట్టాడు.
అమెరికా, వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో భారత జట్టు వరుసగా ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. వరుసగా ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించి ఫైనల్కు చేరిన దక్షిణాఫ్రికాతో టైటిల్ మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. ఇంగ్లండ్తో జరిగిన సెమీ ఫైనల్లో భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ జోడీ మొత్తం 6 వికెట్లు పడగొట్టింది. దీంతో.. సెమీస్లో భారత్ ఏకపక్షంగా విజయం సాధించగలిగింది. మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లండ్పై…
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. రెండో సెమీ ఫైనల్స్లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది. దీంతో.. భారత్ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. 68 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. 16.4 ఓవర్లలోనే ఇంగ్లండ్ను 103 పరుగులకు ఆలౌట్ చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ బౌలర్ల ధాటికి తడబడ్డారు. కేవలం జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, హ్యారీ బ్రూక్ ఈ ముగ్గురే 20 పరుగుల…
వరల్డ్ కప్ 2023లో టీమిండియా విజయాల జోరును చూపించింది. ఆడిన అన్నీ మ్యాచ్ ల్లోనూ గెలిచి ఫైనల్ చేరింది. అయితే ఇప్పుడు ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే టోర్నీ టైటిల్ దక్కించుకుంటుంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్ తదితర ఆటగాళ్లు స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్కు చేరుకుంది.
ICC Test Championship Finals: క్రికెట్లో టెస్ట్ క్రికెట్లో ఉండే మజానే వేరు. కానీ కొన్నేళ్లుగా టీ20లు రాజ్యమేలుతున్నాయి. దీంతో ఐసీసీ టెస్ట్ క్రికెట్ పునరుజ్జీవం కోసం టెస్టు చాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది తొలిసారిగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడగా న్యూజిలాండ్ విన్నర్గా…
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతితో రాజస్థాన్ రాయల్స్ భంగపాటుకు గురైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లోనూ సంజు శాంసన్ ఇదే తప్పు చేశాడు. ఫైనల్లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై విమర్శలు చెలరేగాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సంజు శాంసన్ వివరించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు…